News November 19, 2025
ఖమ్మం: మార్చురీలో శవాలపై కక్కుర్తి వసూళ్లు

శవాలపై పేలాలు ఏరుకోవడం అనే డైలాగ్ వినే ఉంటాం. ఇలాంటి ఘటనే ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీ సిబ్బంది వ్యవహారంతో స్పష్టంగా కనిపిస్తుంది. పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహాన్ని అప్పగించేందుకు రూ.3-5 వేల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రికి ఏడాదికి 1000కి పైగా మృతదేహాలు వస్తున్న నేపథ్యంలో ఈ దందాపై వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
Similar News
News March 6, 2026
రూ.9.8 లక్షల కోట్ల ఆస్తితో ముకేశ్ నంబర్-1

హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2026లో IND నుంచి ముకేశ్ అంబానీ(రిలయన్స్ ఇండస్ట్రీస్) ₹9.8 లక్షల కోట్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో గౌతమ్ అదానీ(₹7.5L Cr), రోష్నీ నాడార్ మల్హోత్రా-HCL(₹3.2L Cr), పూనావాలా-సీరమ్ ఇన్స్టిట్యూట్(₹3L Cr), కుమార మంగళం బిర్లా-ఆదిత్య బిర్లా(₹2.5L Cr), దిలీప్ సంఘ్వీ-సన్ ఫార్మా(₹2.3L Cr), అజీమ్ ప్రేమ్జీ-విప్రో(₹2.3L Cr), నీరజ్-బజాజ్ ఆటో(₹2.2L Cr) ఉన్నారు.
News March 6, 2026
కామారెడ్డి: కాంగ్రెస్ కార్యాలయానికి స్థలం కేటాయించాలని వినతి

కామారెడ్డిలో కాంగ్రెస్ కార్యాలయ నిర్మాణానికి 2 ఎకరాల స్థలం కేటాయించాలని డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్కు వినతిపత్రం అందజేశారు. పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. జిల్లాలో సొంత పార్టీ కార్యాలయం లేకపోవడంతో కార్యకలాపాల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వెంటనే స్థలం కేటాయించి సహకరించాలని వారు కలెక్టర్ను కోరారు.
News March 6, 2026
రేపు సీతంపేట ఐటీడీఏలో జిల్లా కలెక్టర్ పర్యటన

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర రెడ్డి శనివారం సీతంపేట ఐటీడీఏలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్లో నూతనంగా ఏర్పాటు చేసిన పవర్ గార్డెన్, ఇప్పకూడ గ్రామంలో ముస్తాబు కార్యక్రమం, జగతపల్లి వ్యూ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో పాయింట్ను కలెక్టర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుందని ఐటీడీఏ సిబ్బంది పేర్కొన్నారు.


