News October 10, 2025
ఖమ్మం: యూట్యూబ్లో చూసి హతమార్చారు..!

ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన వెంకటేశ్వర్లు(38) హత్య కేసును పోలీసులు ఛేదించారు. కామేపల్లి మండలం కెప్టెన్ బంజరకు చెందిన వెంకటేశ్వర్లును డబ్బు కోసమే ప్రధాన నిందితుడు అశోక్ కిరాతకంగా చంపినట్లు తేలింది. హత్యకు ముందు, మృతదేహాన్ని ముక్కలుగా నరికి పారేసే విధానాన్ని నిందితుడు యూట్యూబ్లో చూసి ప్లాన్ చేసుకున్నాడు. ఈ కేసులో అశోక్తో సహా ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎసీపీ తిరుపతి రెడ్డి తెలిపారు.
Similar News
News October 10, 2025
HYD: రాంగ్ సైడ్ డ్రైవింగ్..15,641 కేసులు నమోదు

సైబరాబాద్ పోలీసులు 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు రాంగ్ సైడ్ డ్రైవింగ్పై 15,641 కేసులు నమోదు చేశారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటి వరకు రూ.72,02,900 జరిమాణాలు విధించినట్లు వెల్లడించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ ప్రమాదానికి ముప్పు అని తెలిపారు.
News October 10, 2025
లడ్డూ ప్రసాదాల బాక్సులపై దేవుడి ముద్రలు వద్దు: నెటిజన్లు

దైవ దర్శనాలకు వెళ్లి తిరిగివచ్చిన భక్తులను ఓ సమస్య వెంటాడుతోంది. ప్రముఖ దేవాలయాల లడ్డూ ప్రసాదాల బాక్సులపై దేవుడి బొమ్మలు, ఆలయ గోపురాలు ముద్రించడమే దీనికి కారణం. లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించాక ఖాళీ బాక్సులు, కవర్లను చెత్తలో ఎలా పారేస్తామని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అందుకే దేవాలయం, దేవుడి బొమ్మలకు బదులు ఆలయ పేరు లేదా లోగోను ముద్రించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News October 10, 2025
PKSM: తెలియని నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయా..?

తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రకాశం జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఐటీ కోర్ పోలీసులు విస్తృతంగా సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు. కేవైసీ పేరుతో జరిగే మోసాల పట్ల చైతన్యపరుస్తూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏ బ్యాంక్ కూడా కేవైసీ గురించి కాల్స్ చేసి ఓటీపీ అడగదని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.