News March 22, 2025

ఖమ్మం: రామయ్య తలంబ్రాలకు విశేష స్పందన: ATM రామారావు

image

ఈనెల 15 న ఆర్టీసీ MD సజ్జనార్ చేతుల మీదుగా ప్రారంభించిన సీతరాముల కళ్యాణ తలంబ్రాల బుకింగ్స్ కు విశేష స్పందన లభిస్తుందని ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల కార్గో ATM రామారావు తెలిపారు. ప్రారంభించిన వారం రోజుల్లోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు 300 బుకింగ్స్ అయినట్లు తెలిపారు. సీతారాముల తలంబ్రాలు కావాల్సినవారు 151 రూపాయి చెల్లించి బుకింగ్ చేసుకున్న వారికి ఇంటి వద్దకే చేరుస్తామన్నారు.

Similar News

News July 10, 2025

మత్స్య రైతుల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు: అ.కలెక్టర్

image

మత్స్య రైతుల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి అన్నారు. అదనపు కలెక్టర్, జాతీయ మత్స్య రైతుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మత్స్య రైతులకు బీమా, కిసాన్ క్రెడిట్ కార్డుల మంజూరు, ఇతర సదుపాయాల కల్పనను కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.

News July 10, 2025

ఖమ్మం శివారులో యాక్సిడెంట్

image

బైక్‌పై వెళుతూ ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి గాయాలైన ఘటన ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇద్దరు యువకులు బైక్‌పై ఖమ్మం వైపు వెళుతూ డివైడర్‌ను ఢీకొట్టారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News July 10, 2025

ఖమ్మం: సీఎంఆర్ రిక‘వర్రీ’

image

జిల్లాలోని 66 మిల్లర్లు ప్రభుత్వానికి సకాలంలో సీఎంఆర్ బియ్యంను అందించడంలో విఫలమవుతున్నారు. 2024-25 యాసంగి సీజన్‌లో ఇప్పటివరకు ప్రభుత్వానికి 60% మాత్రమే అందించారు. ఈ సీజన్లో 4,55,981,360 మె.ట ధాన్యాన్ని మిల్లర్లకు ఇవ్వగా, 1,84,444,836 మె.ట బియ్యంను అప్పగించారు. మరో 1,21,298,515 మె.ట అందజేయాల్సి ఉండగా.. ఈ ఏడాది SEPతో గడువు ముగియనుంది. పెండింగ్ సీఎంఆర్‌పై అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాలి.