News September 20, 2025
ఖమ్మం రీజియన్లో ఉద్యోగులకు బదిలీలు

ఖమ్మం రీజియన్లో ఆర్టీసీ ఉద్యోగులను బదిలీ చేస్తు RM సరిరామ్ ఉత్తర్వులు జారీ చేశారు. కండక్టర్లు, డ్రైవర్లు, శ్రామిక్లకు పదోన్నతులతో పాటు వారు కోరుకున్న చోటుకు బదిలీలు కల్పించారు. RMగా సరిరామ్ బాధ్యతలు తీసుకున్న ఏడాదిలోనే రెండవసారి పదోన్నతులు, బదిలీలు చేపట్టడం ద్వారా జిల్లాలోని ఉద్యోగులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News September 20, 2025
VZM: ‘గంజాయిపై ఉక్కుపాదం మోపాం’

అందరి సహకారం, సమన్వయంతో జిల్లాను రాష్ట్రంలో అన్ని విభాగాల్లోను అగ్రగామిగా నిలిపామని విజయనగరం పూర్వ ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. స్థానిక పోలీస్ పరేడ్లో శనివారం వీడ్కోలు కార్యక్రమం జరిగింది. గంజాయి మూలాలను సమూలంగా నాశనం చేశామని, గంజాయి అక్రమ రవాణకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసి, వారి ఆస్తులను కూడా అటాచ్ చేశామన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయడం వలనే ఇది సాధ్యమైందన్నారు.
News September 20, 2025
విజయవాడలో కొత్త రూపంలో డ్రగ్స్

విజయవాడలో కొత్తరకం డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. సరిగ్గా మెడికల్ షాపులో టాబ్లెట్స్లా గంజాయి టాబ్లెట్ల ఫోటోలు బయటకు రావడం హల్చల్గా మారింది. నగరంలో మూడు, నాలుగు బస్తాలకు పైగా ఇలాంటి డ్రగ్స్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయని తెలుస్తోంది. మాచవరం పరిధిలో ఈ డ్రగ్స్ సరఫరా జరుగుతోందని సమాచారం. దసరా ఉత్సవాలపై పోలీసుల దృష్టి ఉండడంతో డ్రగ్స్ సప్లై చేసే ముఠా సభ్యులు చెలరేగిపోతున్నారు.
News September 20, 2025
HYD: సూపర్ మార్కెట్లకు జీహెచ్ఎంసీ నోటీసులు

గ్రేటర్ పరిధిలో 44 సూపర్ మార్కెట్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అధికారులు తనిఖీలు చేశారు. 58 శాంపిల్స్ సేకరించి నాచారంలోని ఫుడ్ టెస్టింగ్ లాబరేటరీకి పంపించారు. నిబంధనలను ఉల్లంఘించిన సూపర్ మార్కెట్లకు నోటీసులు జారీ చేశారు. తేదీ గడిచిన పదార్థాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.