News February 6, 2025
ఖమ్మం: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738808155585_20471762-normal-WIFI.webp)
ఖమ్మం మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేయగా, ఇంకొన్నింటిని దారి మళ్లిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మూడో లైన్ నిర్మాణ పనుల కారణంగా కాజీపేట-విజయవాడ మార్గంలో నడిచే 30 రైళ్లను ఈనెల 10నుంచి 20వరకు రద్దు చేస్తున్నట్లు, ఇంకొన్నింటిని సికింద్రాబాద్- నడికుడి మార్గంలో నడిపించనున్నట్లు అధికారులు చెప్పారు. అలాగే, వారాంతపు రైళ్లను కూడా రద్దు చేయగా మరికొన్ని రైళ్లు నిర్ణీత తేదీల్లోనే నడుస్తాయని తెలిపారు.
Similar News
News February 6, 2025
మణుగూరు అటవీ ప్రాంతంలో పెద్దపులి.. పేరు ఇదే..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738811831562_710-normal-WIFI.webp)
మణుగూరు అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పులి మూడేళ్లుగా జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కానీ కొద్దిరోజులే జిల్లా దాటుతోంది. దీంతో 2 నెలల క్రితం వచ్చిన పులి తిరిగి వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. రెండు నెలలుగా పులి జిల్లా దాటకపోవడంతో మగ పులిగా నిర్ధారించి ‘భద్ర’ అని నామకరణం చేశామని డీఎఫ్ఓ కృష్ణాగౌడ్ తెలిపారు. ఈనెల 2న కెమెరాకు చిక్కిందన్నారు.
News February 6, 2025
ఖమ్మం: భార్య మర్డర్.. భర్త, అత్తకు జీవిత ఖైదు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738806962635_710-normal-WIFI.webp)
భార్యను హతమార్చిన కేసులో భర్తకు, ఆమె అత్తకు జీవిత ఖైదు జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. మెజిస్ట్రేట్ వివరాలిలా.. ముదిగొండ మండలం బాణాపురం తండాకు చెందిన టీ.ఉపేందర్ 2017లో కళ్యాణిని వివాహం చేసుకున్నాడు. అదనపు కట్నం కోసం 2020లో హత్య చేశాడు. ఈ ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు కాగా, విచారించిన కోర్టు భర్త ఉపేందర్, అత్త పద్మకు జీవిత ఖైదు విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది.
News February 6, 2025
KMM: గుడ్ న్యూస్.. ఒకేషనల్ స్టూడెంట్స్కు ఆహ్వానం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738764773756_51927665-normal-WIFI.webp)
ఇంటర్మీడియట్ MPHW(ఫిమేల్) ఒకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి ఏడాది క్లినికల్ అప్రెంటిస్ షిప్ శిక్షణకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కే.రవిబాబు ప్రకటనలో తెలిపారు. శిక్షణకు ఎంపికైన వారు రూ.1000 ఆసుపత్రి పేరున డీడీ చెల్లించాలన్నారు. గతంలో దరఖాస్తు చేసుకొని ఎంపిక కాని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు.