News April 10, 2024
ఖమ్మం: వడదెబ్బతో ఒకే రోజు ముగ్గురు మృతి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వడదెబ్బతో ఒకే రోజు ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. కారేపల్లి మండలం తొడితలగూడెంకి చెందిన వెంకటేశ్వర్లు (55) వ్యవసాయ కూలీ పనికి వెళుతుంటారు. సోమవారం వడదెబ్బ కొట్టగా మంగళవారం చనిపోయారు. బోడు పంచాయతీ లాక్యాతండాకు చెందిన బాలాజీ, కొత్తగూడేనికి చెందిన 14,15 డివిజన్ల సీపీఐ కార్యవర్గ సభ్యుడు బక్కయ్య ఎండదెబ్బతో మృతిచెందారు.
Similar News
News October 10, 2024
ఖమ్మం: ‘ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లులపై చర్యలు’
ఖమ్మంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ పక్కదారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. శ్రీజ తెలిపారు. గత రబీ, ఖరీఫ్కు సంబంధించి రైతుల నుంచి ధాన్య సేకరణ చేసిన అనంతరం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, కస్టమ్ మిల్లింగ్ రైస్ను తిరిగి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అయితే ధాన్యాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించలేదు. దీంతో ఆయా మిల్లులపై చర్యలు చర్యలు తీసుకుంటామని అన్నారు.
News October 9, 2024
భద్రాద్రి: పర్యావరణానికి ఉపయోగపడే మొక్కలను పెంచాలి: కలెక్టర్
భద్రాద్రి జిల్లాలోని నర్సరీలో పర్యావరణానికి,ఆయుర్వేదంగా ఉపయోగపడే మొక్కలను పెంచాలని జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పర్యావరణానికి అనుకూలమైన మొక్కలను జిల్లాలోని అన్ని కెనాల్ రెండు వైపులా నాటే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని ఖాళీ స్థలాల్లో సైతం మొక్కలు పెంచాలన్నారు.
News October 9, 2024
అర్ధరాత్రి వెలిసిన మావోయిస్టు ఫ్లెక్సీలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని ముసలిమడుగు పంచాయతీలోని సందళ్లు రాంపురంలో గ్రామంలో మణుగూరు-పాల్వంచ డివిజన్ ఏరియా కమిటీ పేరుతో మావోయిస్టుల ఫ్లెక్సీలు వెలిశాయి. ”మావోయిస్టు పార్టీ 20వ వార్షికోత్సవం సందర్భంగా దృఢ సంకల్పంతో వారోత్సవాలు జరుపుకోండి” అంటూ ఆ ఫ్లెక్సీ పై రాసి ఉంది. అక్టోబర్ 20వ తేదీ వరకు వారోత్సవాలు జరుపుకుంటామని ప్లెక్సీలో పేర్కొన్నారు.