News March 21, 2024
ఖమ్మం: విదేశానికి వెళ్లిన ఉపాధ్యాయుడి సస్పెండ్

అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లిన ఉపాధ్యాయుడిని ఉన్నతాధికారులు బుధవారం సస్పెండ్ చేశారు. వైరా ఎంఈఓ కే.వెంకటేశ్వర్లు తెలిపిన సమాచారం మేరకు.. అష్ణగుర్తి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఎస్జీటీ వై.మధుబాబు తన తండ్రి అనారోగ్యానికి గురయ్యారని ఫిబ్రవరి 13 నుంచి 19 వరకు సెలవు పెట్టారు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లినట్లు అందిన సమాచారంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టి అతణ్ని సస్పెండ్ చేశారు.
Similar News
News February 12, 2026
ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో ‘కెమ్ డ్రా’ కోర్సు ప్రారంభం

ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘కెమ్ డ్రా’ సర్టిఫికెట్ కోర్సును బుధవారం ప్రిన్సిపాల్ మహ్మద్ జకీరుల్లా ప్రారంభించారు. రసాయన పదార్థాల నిర్మాణాలు, వాటి పేర్లను సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ సాఫ్ట్వేర్ కోర్సు విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందని ఆయన తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో కెమిస్ట్రీపై పట్టు సాధించేందుకు ఇదొక మంచి అవకాశమని పేర్కొన్నారు.
News February 12, 2026
ఖమ్మం జిల్లాలో టాప్ కల్లూరు

కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు భారీగా తరలివచ్చారు. జిల్లాలోనే అత్యధికంగా 87.08 శాతం పోలింగ్ నమోదైనట్లు మున్సిపల్ కమిషనర్ ఎం. రామదుర్గారెడ్డి వెల్లడించారు. మొత్తం 18,866 ఓట్లకు గానూ 16,428 ఓట్లు పోలయ్యాయి. 20 వార్డుల్లో నిర్వహించిన పోలింగ్లో 6వ వార్డు 94.85 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, 20వ వార్డులో 75.85 శాతం పోలింగ్ నమోదైంది.
News February 12, 2026
ఖమ్మం: 116 వార్డుల్లో సంగ్రామం.. రేపే తేలనున్న భవితవ్యం

జిల్లాలోని 116 వార్డులకు పోటీ చేసిన అభ్యర్థుల జయాపజయాలు ఈనెల 13న కౌంటింగ్ అనంతరం తేలనుంది. జిల్లావ్యాప్తంగా బుధవారం జరిగిన పోలింగ్లో 82.5% ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 1,41,875 మంది ఓటర్లకు గానూ 1,17,043 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన వారిలో 55,506 మంది పురుషులు, 61,520 మంది మహిళలతో పాటు 17 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. 24,832 మంది ఓటర్లు గైర్హాజరయ్యారు.


