News March 1, 2025
ఖమ్మం: ‘విద్యార్థులను వేధిస్తున్న లెక్చరర్’

బాడీ పార్ట్స్ తాకనిస్తేనే ఇంటర్నల్ మార్కులు వేస్తానని ఇంటర్ విద్యార్థులను ఓ కాంట్రాక్ట్ లెక్చరర్ వేధించిన ఘటన ఖమ్మం నగరంలో జరిగింది. విద్యార్థులు తెలిపి వివరాలు.. ఖమ్మం వాసి కొండా హరిశంకర్ అనే వ్యక్తి స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని విద్యార్థి సంఘం నాయకులు ఈరోజు ధర్నా చేపట్టారు.
Similar News
News March 1, 2025
కనిపించిన నెలవంక.. రేపటి నుంచి పవిత్రమాసం

భారత్లో నెలవంక దర్శనమిచ్చింది. దీంతో రేపటి నుంచి రంజాన్ పవిత్రమాసం ప్రారంభం కానుంది. ఈ సమయంలో నెల రోజుల పాటు ముస్లింలు కఠిన ఉపవాస దీక్షలు చేస్తారు. ఈ మాసంలో తమ సంపదలో కొంత భాగాన్ని పేదలకు దానం చేస్తారు. సౌదీ అరేబియాలో నిన్ననే చంద్రవంక దర్శనమివ్వగా నేటి నుంచి రంజాన్ మొదలైన సంగతి తెలిసిందే. కాగా రంజాన్ మాసంలో తెలంగాణలోని ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వ కార్యాలయ వేళల్లో వెసులుబాటు కల్పించింది.
News March 1, 2025
తిరుమలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని లేఖ

AP: ఇటీవల తిరుమల కొండపై పలుమార్లు విమానాలు చక్కర్లు కొట్టిన ఘటనల నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు లేఖ రాశారు. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని కోరారు. ఆలయ పవిత్రత, ఆగమ శాస్త్ర నిబంధనల దృష్ట్యా నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
News March 1, 2025
CT: సెమీస్ చేరిన జట్లివే

ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్-A నుంచి ఇండియా, న్యూజిలాండ్ జట్లు, గ్రూప్-B నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సెమీస్కు చేరాయి. రేపు ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితంతో సెమీస్లో ఏ జట్లు పోటీ పడతాయనేది తేలనుంది.