News April 15, 2024

ఖమ్మం: శ్రీరామనవమికి 238 ప్రత్యేక బస్సులు

image

భద్రాచలంలో ఈ నెల 17న జరగబోయే శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవానికి మొత్తం 238 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఖమ్మం రీజినల్ మేనేజర్ వెంకన్న తెలిపారు. అన్ని ప్రధాన బస్టాండ్‌ల నుంచి ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 18 వరకు ఈ బస్సులు నడపనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందన్నారు. హైదరాబాద్ నుండి భద్రాచలానికి రిజర్వేషన్ సౌకర్యం కలదని పేర్కొన్నారు.

Similar News

News October 1, 2024

ఖమ్మం గ్రీవెన్స్‌కు భారీగా వినతులు

image

ఖమ్మం గ్రీవెన్స్‌లో వివిధ సమస్యలపై ప్రజలు వినతులు అందించేందుకు భారీగా తరలివచ్చారు. కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ఎక్కువగా భూ సంబంధిత సమస్యలే వచ్చాయని వాటిని క్షేత్రస్థాయిలో వెళ్లి విచారించి న్యాయం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

News September 30, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

• విద్యార్థుల చదువులకు ఆటంకం కలగొద్దు: జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్
• ఆపరేషన్ చేసి గడ్డను తొలగించిన భద్రాచలం ఎమ్మెల్యే
• ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి: భద్రాద్రి జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్
• పాలడుగు జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ సస్పెండ్
• కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న గిరిజన సంఘాలు
• భద్రాచలం వద్ద స్వల్పంగా పెరిగిన గోదావరి నీటిమట్టం

News September 30, 2024

ఖమ్మం: విద్యార్థుల చదువుకు ఆటంకం కలగొద్దు: కలెక్టర్

image

విద్యార్థులకు విద్య అభివృద్ధి, ఉద్యోగుల పదవీ విరమణ సన్మానం, కలెక్టరేట్లో మౌళిక వసతులపై అధికారులతో ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సమావేశం అయ్యారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మంచి వాతావరణం కల్పించాలని సూచించారు. విద్యార్థులకు అమలు అవుతున్న భోజనాన్ని పరిశీలించి తనకు ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని అన్నారు. రిటైర్డ్ అవుతున్నా ఉద్యోగులను ఘనంగా సత్కరించుకుందామన్నారు.