News April 15, 2024

ఖమ్మం: శ్రీరామనవమికి 238 ప్రత్యేక బస్సులు

image

భద్రాచలంలో ఈ నెల 17న జరగబోయే శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవానికి మొత్తం 238 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఖమ్మం రీజినల్ మేనేజర్ వెంకన్న తెలిపారు. అన్ని ప్రధాన బస్టాండ్‌ల నుంచి ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 18 వరకు ఈ బస్సులు నడపనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందన్నారు. హైదరాబాద్ నుండి భద్రాచలానికి రిజర్వేషన్ సౌకర్యం కలదని పేర్కొన్నారు.

Similar News

News April 21, 2025

CMRF స్కాం వెనుక RMPలదే ప్రధాన హస్తమా..?

image

ఖమ్మంలో CMRF స్కాం కలకలం రేపుతుంది. చికిత్స చేయకుండానే నకిలీ బిల్లులు సృష్టించి CMRF నిధులను దుర్వినియోగం చేసిన 10 ఆసుపత్రులను మూసివేసినట్లు DMHO వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ స్కాంలో RMPలదే ప్రధానహస్తంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకొని పూర్తిస్థాయిలో విచారణకు సిద్ధం అవుతుంది. అలాగే ఖమ్మంలోని మరికొన్ని ఆసుపత్రులపై కూడా నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

News April 21, 2025

ఖమ్మం:ఓపెన్ పరీక్షలు..139గైర్హాజర్

image

ఖమ్మం జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పదో తరగతి పరీక్షలకు 488 మందికి గాను 420 మంది హాజరు కాగా 68 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియట్ పరీక్షకు 646 మందికి గాను 575 మంది హాజరు కాగా, 71మంది గైర్హాజరయ్యారని డీఈఓ సోమశేఖర శర్మ  తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు.

News April 21, 2025

కొత్తగూడెం: యువతికి వేధింపులు.. కేసు నమోదు

image

యువతిని వేధింపులకు గురిచేసిన యువకుడిపై కేసు నమోదైంది. వైరా విప్పలమడుగుకి చెందిన రాహుల్‌ కొత్తగూడెంకు చెందిన యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆ యువతి రాహుల్ వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకుని ఇచ్చేసింది. అయితే డబ్బు పూర్తిగా ఇవ్వలేదని.. దానికి బదులుగా తనతో శారీరకంగా దగ్గర కావాలని వేధిస్తున్నాడు. యువతి పోలీసులను ఆశ్రయించగా కేసు నమెాదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తగూడెం సీఐ కరుణాకర్ తెలిపారు.

error: Content is protected !!