News October 12, 2024
ఖమ్మం: శ్రీలక్ష్మీ స్తంభాద్రి నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి
విజయ దశమి పండుగ సందర్భంగా ఖమ్మం నగరంలోని శ్రీ లక్ష్మీ స్తంభాద్రి నరసింహస్వామి దేవస్థానంలో శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ పండితులు, అధికారులు ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలకగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వేదపండితులు ఆశీర్వచనం, స్వామివారి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కమర్తపు మురళీ, గిడ్డంగుల ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు ఉన్నారు.
Similar News
News October 12, 2024
మధిర: వాహన పూజలు చేసిన డిప్యూటీ సీఎం
విజయదశమి పర్వదినం సందర్భంగా శనివారం మధిర క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వాహన పూజా కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో రాష్ట్రం విలసిల్లాలని, సుఖ సంతోషాలతో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని తన క్యాంపు కార్యాలయంలో భట్టి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు.
News October 12, 2024
కొత్తగూడెం: తాలిపేరు నదిలో పడి ఇద్దరు యువకులు మృతి
పండగ రోజు విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తేగడ గ్రామం పరిధిలోని తాలిపేరు నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు నీట మునిగి చనిపోయారు. మృతులు చర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన గట్టుపల్లి జంపన్న (23), సోయంలచ్చి (22)గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 12, 2024
ఖమ్మం: ముగ్గురిపై కేసు నమోదు: సీఐ
మహిళకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలు.. జిల్లా ఆస్పత్రి MCHలో ఓ మహిళా ఉద్యోగికి సహోద్యోగి సురేశ్ మద్యం తాగి ఫోన్ చేశాడు. ఆస్పత్రిలో సిబ్బంది శ్రీకాంత్, సత్యకుమార్కు ఆమెతో వివాహేతర సంబంధం ఉందని చెప్పారని, తనతోనూ ఏకాంతంగా గడపాలంటూ అసభ్యకరంగా మాట్లాడాడు. బాధితురాలు షీటీమ్స్ను ఆశ్రయించగా విచారణ అనంతరం ఆ ముగ్గురిపై కేసు నమోదైంది.