News February 11, 2026
ఖమ్మం: సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు

జిల్లాలోని సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అధికార యంత్రాంగం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఇక్కడ జరుగుతున్న పోలింగ్ను ఖమ్మం కలెక్టరేట్లోని ప్రత్యేక సెల్ ద్వారా అధికారులు పర్యవేక్షించనున్నారు. మొత్తం పోలింగ్ స్టేషన్లలో 25 సమస్యాత్మక, 32అతి సమస్యాత్మకమైనవిగా గుర్తించి వెబ్ కాస్టింగ్ ఏర్పాటుచేస్తున్నారు. అలాగే, ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా 163 సెక్షన్ అమలు చేస్తున్నారు.
Similar News
News February 13, 2026
ర్యాలీలు, సంబరాలపై నిషేధం: ఖమ్మం సీపీ సునీల్ దత్

మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, వేడుకలకు అనుమతి లేదని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ స్పష్టం చేశారు. కమిషనరేట్ వ్యాప్తంగా సెక్షన్ 163 BNSS అమలులో ఉన్నందున నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాణసంచా కాల్చడం, డీజేల వినియోగం, బైక్ ర్యాలీలు, బహిరంగ సభలపై పూర్తిస్థాయిలో నిషేధం విధించినట్లు తెలిపారు.
News February 13, 2026
ఖమ్మం: భక్తులకు గమనిక

మహాశివరాత్రి పండగను పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు ఖమ్మం ఆర్ఎం సరీరామ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తీర్థాలకు, స్థానాల లక్ష్మీపురం, నీలాద్రి, అన్నపురెడ్డి పల్లి, మోతేగడ్డ, బెండలపాడు దేవాలయాలకు స్థానిక డిపోల-79 బస్సులు రాకపోకలు సాగిస్తాయన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలన్నారు.
News February 12, 2026
ఖమ్మం: మున్సిపల్ కౌంటింగ్.. కలెక్టర్ కీలక ఆదేశాలు

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపుపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్తో కౌంటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. కేంద్రాల్లో 100% వెబ్ క్యాస్టింగ్, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. లెక్కింపు ప్రక్రియను వీడియోగ్రఫీ చేయాలని, అధికారులు ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండి విధులు నిర్వర్తించాలన్నారు.


