News January 22, 2026

ఖమ్మం: సర్కారీ బడులకు మహర్దశ.. రూ.7.44 కోట్ల విడుదల

image

ఖమ్మం జిల్లాలోని 1,183 ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం రూ.7.44 కోట్ల నిధులు మంజూరు చేసింది. మౌలిక వసతులు, మరమ్మతుల కోసం రూ.4.99 కోట్లు, సివిల్ పనులకు రూ.78.85 లక్షలు కేటాయించారు. కరాటే, క్రీడలు, బాలికా సాధికారిత కార్యక్రమాలకూ ప్రత్యేక నిధులు ఇచ్చారు. పాఠశాలల యాజమాన్య కమిటీల ద్వారా ఈ నిధులను వెచ్చించి, బడుల రూపురేఖలు మార్చాలని విద్యాశాఖ నిర్ణయించింది.

Similar News

News February 1, 2026

KMM: కాంగ్రెస్ విజయానికి సైనికుల్లా పని చేయాలి: మంత్రి కొండా సురేఖ

image

మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. ఆదివారం ఏదులాపురంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు పదవుల కోసం పోటీ సహజమని, అయితే వార్డుకు ఒకే అభ్యర్థి ఉండేలా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే ఆయుధాలుగా ప్రతి ఇంటి గడప తట్టి, కాంగ్రెస్ విజయానికి సైనికుల్లా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News February 1, 2026

KMM: ఇసుక అక్రమ హవా.. నిమ్మకు నీరెత్తని యంత్రాంగం!

image

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గమైన మధిరలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. చిన్నమండవ, తిమ్మినేనిపాలెం మున్నేరు వాగు నుంచి వందలాది ట్రాక్టర్లతో ఇసుక ఖమ్మం నగరానికి తరలిపోతోంది. ఇందిరమ్మ ఇళ్ల కూపన్ల ముసుగులో చెక్ పోస్టుల నుంచే ఈ రవాణా సాగుతుండటం గమనార్హం. అధికారులు పట్టించుకోకపోవడం వెనుక రాజకీయ నేతల హస్తం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

News February 1, 2026

KMM: దోపిడీ కేసు.. ముగ్గురికి ఐదేళ్ల జైలు శిక్ష

image

ఫేస్‌బుక్ మిత్రుడిపై దాడి చేసి కారు, ఐఫోన్ దోచుకున్న కేసులో ఖమ్మం జిల్లా బోనకల్‌కు చెందిన నరేష్, షేక్ అహ్మద్, వేణులకు కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2020లో విజయవాడలోని ఓ లాడ్జిలో ఫణీంద్ర అనే వ్యక్తిని కొట్టి వాహనం ఎత్తుకెళ్లినందుకు గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.10,500 జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.