News November 18, 2025

ఖమ్మం: సింగరేణి జాబ్‌ మేళా.. 13,867 మందికి ఉపాధి

image

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో సింగరేణి సంస్థ నిర్వహించిన జాబ్‌ మేళా అద్భుత ఫలితాలు సాధించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి నిర్వహించిన మేళాల ద్వారా ఉమ్మడి జిల్లాలో 13,867 మందికి ఉద్యోగాలు లభించాయి. వేలాదిగా దరఖాస్తులు వస్తుండటంతో, సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని CMD బలరాంనాయక్‌ పిలుపునిచ్చారు.

Similar News

News November 18, 2025

BIG ALERT: మీకు ఇలాంటి మెసేజ్ వచ్చిందా?

image

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మార్గంలో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే SBI YONO యాప్ బ్లాక్ అవుతుందంటూ వాట్సాప్ మెసేజ్‌లు చేస్తున్నారు. SBI లోగోను డీపీగా పెట్టుకుని APK ఫైల్స్‌ను పంపుతున్నారు. దీన్ని క్లిక్ చేస్తే అప్డేట్ అవుతుందని చెబుతున్నారు. అయితే SBI అలాంటి ఫైల్స్‌ను ఎప్పుడూ పంపదని, వాటిని క్లిక్ చేయొద్దని PIB Fact Check స్పష్టం చేసింది.
#ShareIt

News November 18, 2025

BIG ALERT: మీకు ఇలాంటి మెసేజ్ వచ్చిందా?

image

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మార్గంలో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే SBI YONO యాప్ బ్లాక్ అవుతుందంటూ వాట్సాప్ మెసేజ్‌లు చేస్తున్నారు. SBI లోగోను డీపీగా పెట్టుకుని APK ఫైల్స్‌ను పంపుతున్నారు. దీన్ని క్లిక్ చేస్తే అప్డేట్ అవుతుందని చెబుతున్నారు. అయితే SBI అలాంటి ఫైల్స్‌ను ఎప్పుడూ పంపదని, వాటిని క్లిక్ చేయొద్దని PIB Fact Check స్పష్టం చేసింది.
#ShareIt

News November 18, 2025

ధర్వేశిపురం ఎల్లమ్మకు మంగళవారం ప్రత్యేక పూజలు

image

కనగల్ మండలం ధర్వేశిపురంలో వెలసిన శ్రీ ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రధాన పూజారి మల్లాచారి ఆధ్వర్యంలో పంచామృతాభిషేకాలు, కుంకుమ పూజలు, మంగళహారతులు నిర్వహించారు. భజన బృందం ఆలాపనతో ఆలయ ప్రాంగణమంతా భక్తి వాతావరణం నెలకొంది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.