News February 22, 2026
ఖమ్మం: సేంద్రియ సాగుకు సర్కారు దన్ను

రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో జిల్లాలో సేంద్రియ సాగును విస్తరించేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎంపిక చేసిన 3,750 ఎకరాలకు గాను, ఎకరానికి రూ. 4 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. రైతులకు గోఆధారిత ఎరువులు, జీవామృతం, పంచగవ్య తయారీపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు.
Similar News
News February 25, 2026
అంగన్వాడీ భవనాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సఖి కేంద్రం పనుల ప్రారంభంలో జాప్యంపై ఇంజినీరింగ్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. రూ.10 లక్షలతో నిర్మిస్తున్న బాలసదన్ భవనాన్ని మార్చి 15లోగా, శిశు గృహ మరమ్మతులను 15 రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయన్నారు.
News February 25, 2026
శ్రీకాకుళం: డయేరియాకు తాగునీరు కలుషితమే కారణమా?

శ్రీకాకుళం నగరంలో ప్రస్తుతం డయేరియా సమస్యగా మారింది. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను నిలిపివేశారు. తాగునీటి కలుషితమే డయేరియాకు కారణమా అన్న చర్చ సాగుతోంది. నీటి సరఫరా కులాయిల్లోకి డ్రైనేజీ నీరు చేరి ఉంటుందని భావిస్తున్నారు. నీటి నమూనాలను విశాఖ ల్యాబ్కు తరలించారు. ల్యాబ్ రిపోర్టు వస్తే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నీరు కలుషితం అతిసార వ్యాధికి కారణమని అధికారుల ప్రాథమిక అంచనా.
News February 25, 2026
NRPT: GI గుర్తింపు కోసం అవగాహన

జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నారాయణపేట పట్టణంలోని ఎస్ ఆర్ ఫంక్షన్ హాలులో బుధవారం భౌగోళిక సూచన (GI) గుర్తింపు కోసం అవగాహన సదస్సు నిర్వహించినట్లు సీఈవో తేజస్ తెలిపారు. నారాయణపేట చీరలకు భౌగోళిక సూచిక సర్టిఫికెట్ లభిస్తే ప్రపంచ వ్యాప్తంగా చీరలకు గుర్తింపు లభిస్తుందని చెప్పారు. జీఐ గుర్తింపుకు సంస్థ తరపున కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో చేనేత కార్మికులు, యజమానులు పాల్గొన్నారు.


