News May 27, 2024
ఖమ్మం: 30.06% పోలింగ్ నమోదు
వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భారీగా పోలింగ్ నమోదు అవుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు 30.06 శాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 4 గంటల వరకు భారీగా పోలింగ్ నమోదు అయ్యే అవకాశం కన్పిస్తుంది. ఇంకా పోలింగ్ కేంద్రాల వద్ద పట్టభద్రులు ఓటు వేసేందుకు భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి.
Similar News
News September 29, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} అశ్వాపురంలో కొనసాగుతున్న మిషన్ భగీరథ కార్మికుల సమ్మె
∆} భద్రాచలంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
∆} తల్లాడ లో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే డా”రాగమయి దయానంద్ పర్యటన
∆} భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లo వెంకటరావు పర్యటన
News September 29, 2024
పంచాయితీ ఓటర్లలో మహిళా ఓటర్లే అధికం
KMM: గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాను జిల్లా అధికారులు విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 8,52, 879 మంది ఓటర్లు ఉండగా వీరిలో మహిళలు 4,39,808, పురుషులు4,13,048 మంది,థర్డ్ జెండర్ 23 మంది ఉన్నారు. కాగా పురుషుల కంటే మహిళా ఓటర్లు 26,760 మంది అధికంగా ఉన్నారు. జిల్లాలో 589 గ్రామపంచాయతీలో 5,398 వార్డుల ఓటర్ల జాబితాను ప్రకటించారు.
News September 29, 2024
మనల్ని మనం ఎప్పుడూ తక్కువగా అంచనా వేసుకోవద్దు: కలెక్టర్
యువత ప్రయాణంలో నేటి మెగా జాబ్ మేళా తొలి అడుగు మాత్రమేనని, ఈ రోజు వచ్చే ఉద్యోగం చేస్తూ జీవితంలో మరింత ఉన్నత స్థితికి చేరుకునేందుకు నిరంతరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం SR&BGNR డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. మనల్ని మనం ఎప్పుడూ తక్కువగా అంచనా వేసుకోవద్దని కలెక్టర్ సూచించారు.