News September 12, 2024
ఖమ్మం: 387 మంది పంచాయతీ కార్యదర్శులు బదిలీ
ఖమ్మం జిల్లావ్యాప్తంగా 387 మంది పంచాయతీ కార్యదర్శులను బదిలీ బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ బుధవారం ఉత్తర్వులు వెలువరించారు. పరిపాలనాపరమైన అవసరాల మేరకు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. బోనకల్ మండలంలో 10, చింతకాని- 11, ఏన్కూరు-24 కల్లూరు-16, కామేపల్లి-22, ఖమ్మం గ్రామీణం- 19, కొణిజర్ల- 15, కూసుమంచి- 24, మధిర-19, ముది గొండ-14, నేలకొండపల్లి-20, పంచాయతీ కార్యదర్శులు బదిలీ అయ్యారు.
Similar News
News October 5, 2024
రైతుబంధులో అవకతవకలు జరిగాయి: మంత్రి పొంగులేటి
రైతుబంధులో అవకతవకలు జరిగాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి మం. నెల్లికల్లో భూసమస్యల పరిష్కారం కోసం రైతులతో ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్టిఫికెట్లు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాబోయే గ్రామ పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని ఓటర్లకు సూచించారు.
News October 5, 2024
KTDM: సమాధి వద్దే సూసైడ్ అటెంప్ట్
ఆళ్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి శుక్రవారం పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల వివరాలిలా.. వెంకటేశ్కి వరుసకు కొడుకయ్యే ప్రవీణ్ ఇటీవల మృతిచెందాడు. ప్రవీణ్ సమాధి వద్దకు వెళ్లిన వెంకటేశ్ మనస్తాపంతో పురుగు మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. గమనించిన బంధువులు అతణ్ని కొత్తగూడెం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News October 5, 2024
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ నమోదుకు అవకాశం
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం అర్హులైన ఉపాధ్యాయులు నవంబర్ 6 లోపు ఫారం19 ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. గతంలో ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న ఉపాధ్యాయులు సైతం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.