News August 31, 2025

ఖమ్మం: ACCIDENT.. మహిళ SPOT DEAD

image

రఘునాథపాలెం(M) వెంకటాయపాలెంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. ఏన్కూరు(M) కేసుపల్లికి చెందిన వెంకటేశ్వర్లు తన భార్య లక్ష్మితో కలిసి బైక్‌పై వెళ్తుండగా, ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా, భర్త వెంకటేశ్వర్లు గాయపడ్డారు. కళ్ల ముందే భార్య మరణించడంతో వెంకటేశ్వర్లు కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

Similar News

News September 3, 2025

HYD: రైల్వే స్టేషన్‌లో హెల్ప్‌లైన్ కౌంటర్ల ఏర్పాటు

image

సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల వద్ద హెల్ప్‌లైన్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ రైల్వే స్టేషన్ 90633 18082, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 040-27786170 నంబర్లకు కాల్ చేసి రైళ్లకు సంబంధించి వివరాలు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. వివిధ రైళ్ల రూట్లలో మార్పులు, షెడ్యూల్ మార్పులకు సంబంధించి అప్‌డేట్ అందిస్తామన్నారు.

News September 3, 2025

HYD: SEP 17న TG విమోచన దినోత్సవం: BJP

image

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్నట్లుగా బీజేపీ TG చీఫ్ రాంచందర్‌రావు తెలిపారు. వారం రోజుల ముందుగానే పరేడ్ గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయన్నారు. గతంలో కంటే ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

News September 3, 2025

మాడగడలో పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరకు నియోజకవర్గ పర్యటన ఖరారైంది. ఈ మేరకు పర్యటన వివరాలు అధికారికంగా విడుదల చేశారు. ఈ నెల 5వ తేదీన ఉదయం 7.45 నిమిషాలకు గన్నవరం నుంచి ఫ్లైట్లో విశాఖ బయలుదేరుతారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి 8.50 గంటలకు రోడ్డు మార్గం ద్వారా 11.30 లకు మాడగడలో జరుగుతున్న భలి ఉత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.