News June 30, 2024
ఖమ్మం: GREAT.. ఆల్ ఇండియా 35వ ర్యాంకు
ఖమ్మం రూరల్ పెద్ద తండాకు చెందిన బానోతు వీరన్న-జ్యోతి పెద్ద కుమారుడు బానోత్ అమిత్ రాథోడ్ ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించాడు. HYDలో ఇంటిగ్రేటెడ్ సివిల్స్ అకాడమీలో డిగ్రీ పూర్తి చేసి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ-పీజీ)ను ఇటీవల రాశాడు. ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా 35వ ర్యాంకు సాధించి సీటు పొందాడు. అమిత్ రాథోడ్ను పలువురు అభినందించారు.
Similar News
News July 8, 2024
గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
భద్రాచలంలో గల్లంతైన హైదరాబాద్కు చెందిన హరీష్ (28) మృతదేహం లభ్యమైంది. ఆదివారం రాత్రి వరకు వెతికిన ఆచూకీ దొరకలేదు. ఈరోజు ఉదయం గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
News July 8, 2024
ఆదాయం దండిగా వస్తున్నా.. ఇంకా అద్దె భవనాల్లోనే!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వానికి ప్రతినెల పెద్ద మొత్తంలో ఆదాయం అందించే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయాలు సొంత స్థలాలు ఉన్నా ఏళ్ల తరబడి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూశాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో సొంత భవనాలు సమకూరుతాయని, ఈ శాఖపై ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
News July 8, 2024
ఖమ్మం మార్కెట్లో పెరిగిన మిర్చి ధర
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,550 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,300 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ.2050 పెరగగా, పత్తి ధర మాత్రం రూ.50 తగ్గినట్లు వ్యాపారస్థులు తెలిపారు.