News October 29, 2025

ఖమ్మం: MPని లైట్ తీసుకుంటున్నారా..!

image

ఖమ్మంలో ముగ్గురు మంత్రుల మధ్య MP రఘరాంరెడ్డి ప్రభావం చూపలేకపోతున్నారన్న చర్చ నడుస్తోంది. మంగళవారం జరిగిన దిశ సమీక్ష సమావేశామే ఇందుకు ఉదాహరణగా ఉటంకిస్తున్నారు. మీటింగ్‌కు MLAలు, జిల్లా ఉన్నతాధికారులు గైర్హాజరయ్యారు. వైరా, సత్తుపల్లి MLAలు తమ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ MP సమీక్షకు హాజరుకాలేదని సమాచారం. మంత్రులను మచ్చిక చేసుకోవడంలో అధికారులు క్యూ కడుతున్నారే తప్పా ఎంపీని పట్టించుకోవడం లేదని టాక్.

Similar News

News October 30, 2025

విద్యుత్ స్తంభాల వద్ద అప్రమత్తంగా ఉండండి: SE

image

మొంథా తుఫాను ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసా చారి తెలిపారు. రైతులు పంట పొలాల వద్ద జాగ్రత్తలు పాటించాలని, పశువులను విద్యుత్ స్తంభాలకు కట్టరాదని సూచించారు. ఉరుములు, పిడుగులు సంభవించినప్పుడు విద్యుత్ లైన్స్ సమీపంలో ఉండవద్దని హెచ్చరించారు. విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

News October 30, 2025

తిరుమలలో పుష్పయాగానికి అంకురార్పణ

image

తిరుమలలో శ్రీవారి వార్షిక పుష్పయాగానికి బుధవారం రాత్రి అంకురార్పణ జరిగింది. గురువారం పుష్పయాగాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ముందు రోజున వసంత మండపంలో అర్చకులు అంకురార్పణ చేపట్టారు. దీంతో సహస్ర దీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. కార్యక్రమంలో ఆలయ పేష్కార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

News October 30, 2025

సింగరేణి జీఎంపై చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి: సీఎంఓఏఐ

image

జిల్లా బార్ అసోసియేషన్ వారు సింగరేణి జీఎంపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా అసోసియేషన్ వారు అన్నారు. వారు మాట్లాడుతూ.. ఇప్పటికే పైలట్ కాలనీ ఆసుపత్రి భవనాన్ని జిల్లా కోర్టుకు ఇచ్చామన్నారు. అదే విధంగా న్యాయమూర్తుల కోసం సింగరేణి క్వార్టర్లను, బంగ్లాస్ ఏరియా గెస్ట్ హౌస్ మైనారిటీ పాఠశాలకు, 70కి పైగా క్వార్టర్లను ప్రభుత్వ అధికారులకు ఇచ్చామన్నారు.