News March 15, 2025

ఖమ్మం: Way2Newsలో కథనం.. అ.కలెక్టర్ పరిశీలన

image

‘సాగు నీళ్లు కరవై.. పొలం బీళ్లై’ శీర్షికన Way2Newsలో ఈరోజు పబ్లిష్ అయిన కథనానికి అదనపు కలెక్టర్ శ్రీజ స్పందించారు. ముదిగొండ మండలంలోని కమలాపురం గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి, మాట్లాడారు. చివరి ఆయకట్టు వరకు నీరందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యలను మండల అధికారులు ఉన్నతాధికారులకు నివేదించాలని, తద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఆమె వెంట మండల అధికారులు పాల్గొన్నారు.

Similar News

News March 1, 2026

షేర్ మార్కెట్ పేరుతో నిలువు దోపిడీ.. కేటుగాడికి రిమాండ్

image

ఖమ్మం: ఆన్‌లైన్ ఉద్యోగాలు, షేర్ మార్కెట్ ట్రేడింగ్‌లో అధిక లాభాల ఆశచూపి రూ.47 లక్షలు వసూలు చేసిన కేటుగాడిని ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి రిమాండ్ విధించి జైలుకు తరలించారు. గుర్తు తెలియని వ్యక్తుల మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు.

News March 1, 2026

ఖమ్మం చేరుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

image

మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆదివారం ఖమ్మం చేరుకున్నారు. స్థానిక రైల్వే స్టేషన్‌లో ఆయనకు శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు గోంగూర వెంకటేశ్వర్లుతో పాటు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన వాజ్ పేయి శత జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

News March 1, 2026

ఖమ్మం: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు..

image

ఖమ్మం జిల్లాలో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో అర్హులైన పేదలు ఇబ్బందులు పడుతున్నారు. కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రులు చెబుతున్నా, ఆచరణలో మాత్రం దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. కొత్తకార్డులతో పాటు, కుటుంబ సభ్యుల పేర్ల చేర్పుల కోసం నెలల తరబడి వేచి చూస్తున్నామని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా మంత్రులు స్పందించి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని కోరుతున్నారు.