News October 16, 2025
ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై జగిత్యాల కలెక్టర్ సమీక్ష

ఖరీఫ్ 2025–26 సీజన్లో 6,66,500 మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు ప్రణాళికపై కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ BS లత గురువారం రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రతి మిల్లు 100శాతం బ్యాంక్ గ్యారెంటీ సమర్పించాలని, లారీలు వెంటనే దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 423 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతుందని, నాణ్యతకు లోటు ఉన్న ధాన్యాన్ని వెంటనే సిబ్బందికి తెలియజేయాలని సూచించారు.
Similar News
News October 17, 2025
MHBD: ఘనంగా అవిభక్త కవలలు వీణా-వాణిల పుట్టినరోజు వేడుకలు

MHBD(D) దంతాలపల్లి(M) బీరిశెట్టిగూడేనికి చెందిన నాగలక్ష్మి-మురళీ దంపతుల కుమార్తెలు అవిభక్త కవలలు వీణా-వాణిల 23వ జన్మదిన వేడుకలను స్టేట్ హోమ్(HYD)లో గురువారం నిర్వహించారు. తమ పిల్లల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకొని తమను ఆదుకుంటుందని తల్లిదండ్రులు అన్నారు. అలాగే, వైద్యరంగంలో జరిగిన అభివృద్ధితో తమ బిడ్డలైన అవిభక్త కవలలను విడదీసి సంపూర్ణ ఆరోగ్యంతో తమకు అప్పగించాలని కోరారు.
News October 17, 2025
MBNR: రూ.12 కోట్ల విరాళాన్ని ప్రకటించిన ఏంఎస్ఎన్ రెడ్డి

పాలమూరు విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియం నిర్మాణం కోసం మన్నె సత్యనారాయణ రెడ్డి రూ.12 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. 4వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన భావోద్వేగంగా మాట్లాడుతూ.. ‘ఈ నేల పుట్టిన బిడ్డగా పాలమూరు విశ్వవిద్యాలయం వేదికపై మాట్లాడటం నాకు గొప్ప గౌరవంగా ఉంది. ఒకప్పుడు వలసల కోసం పేరుగాంచిన పాలమూరు, ఇప్పుడు విద్య, ఆరోగ్యం, పరిశ్రమల రంగాల్లో అభివృద్ధి సాధించడం గర్వకారణం’ అని అన్నారు.
News October 17, 2025
యూసుఫ్గూడ: అవిభక్త కవలలు వీణా-వాణిల పుట్టినరోజు వేడుకలు

అవిభక్త కవలలు వీణా-వాణిల 23వ జన్మదిన వేడుకలను యూసుఫ్గూడలోని స్టేట్ హోమ్లో గురువారం నిర్వహించారు. తమ పిల్లల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకొని తమను ఆదుకుంటుందని తల్లిదండ్రులు తెలిపారు. అలాగే, వైద్యరంగంలో జరిగిన అభివృద్ధితో తమ బిడ్డలైన అవిభక్త కవలలను విడదీసి సంపూర్ణ ఆరోగ్యంతో తమకు అప్పగించాలని కోరుతున్నారు.