News September 3, 2025

ఖైరతాబాద్: నిమజ్జనానికి రూట్ మ్యాప్ రెడీ: సీపీ ఆనంద్

image

గణేశ్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు ముందుగానే సిద్ధం చేశామని HYD సీపీ సీవీ.ఆనంద్ తెలిపారు. రూట్ మ్యాప్‌లో భాగంగా ఆయన HYD కలెక్టర్ హరిచందన, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి బాలాపూర్ గణేశ్ మండపాన్ని ఈరోజు సందర్శించారు. ప్రత్యేక పూజల అనంతరం నిమజ్జన శోభాయాత్ర సాగే చాంద్రాయణగుట్ట, చార్మినార్, మొజాంజాహీ మార్కెట్, అబిడ్స్, ట్యాంక్ బండ్ రూట్‌లను పరిశీలించి పలు సూచనలు చేశారు.

Similar News

News September 3, 2025

బాలల సంరక్షణ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి: జేసీ

image

నంద్యాల జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాలలో కనీస సౌకర్యాలు తప్పక కల్పించాలని జేసీ విష్ణు చరణ్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా విద్య, వైద్య, కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారా లేదా అని ప్రతి మూడు నెలలు ఒకసారి జిల్లా ఇన్స్పెక్షన్ కమిటీ తనిఖీలు చేసి నివేదికను తమకు సమర్పించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలన్నారు.

News September 3, 2025

చిత్తూరు జిల్లాలో ముగ్గురికి రాష్ట్రస్థాయి అవార్డులు

image

చిత్తూరు జిల్లాలో ముగ్గురు టీచర్లకు రాష్ట్రస్థాయి అవార్డులు లభించాయి. నరహరిపేట జడ్పీ టీచర్ ఫిజిక్స్ టీచర్ నౌషద్ అలీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన 30 ఏళ్లుగా విద్యా రంగంలో సేవలు అందించారు. ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ సైతం రూపొందించారు. పుంగనూరు మండలం రాంనగర్ స్కూల్ టీచర్ హేమలత, నక్కబండ కేజీబీవీ టీచర్ నౌజియా సైతం రాష్ట్రస్థాయి ఉత్తమ టీచర్ అవార్డులకు ఎంపికయ్యారు. వారికి పలువురు అభినందనలు తెలిపారు.

News September 3, 2025

PHOTOS: ఉత్తరాదిలో వర్ష బీభత్సం

image

కుండపోత వర్షాలతో ఉత్తర భారతం వణికిపోతోంది. పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్‌, ఢిల్లీలో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంజాబ్, చండీగఢ్‌, హిమాచల్‌లో ఈనెల 7 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌లో ఫ్లాష్ ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్‌తో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఢిల్లీలో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. పరీవాహక ప్రాంత ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.