News October 25, 2025

ఖైరతాబాద్, శేరిలింగంపల్లికి ఉప ఎన్నిక: KTR

image

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో గెలిస్తే రాబోయే GHMC ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుస్తామని KTR ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఖైరతాబాద్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు కచ్చితంగా పడుతుందన్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు తప్పవని కేటీఆర్‌ జోస్యం చెప్పారు. TGలోని పార్టీ మారిన MLAల నియోజకవర్గాల్లోనూ ఉప ఎన్నికలు వస్తాయని KTR తెలిపారు. కాంగ్రెస్‌ చేసిన మోసం ప్రజలకు వివరించాలన్నారు.

Similar News

News October 26, 2025

పండుగ రోజున ఉల్లిపాయ ఎందుకు తినకూడదు?

image

ఉల్లిపాయలో ఉండే తామసిక గుణం వల్ల మన శరీరంలో వేడి, ఉత్తేజం పెరుగుతుంది. పండుగ రోజుల్లో మన మనస్సు ప్రశాంతంగా, స్థిరంగా, భగవత్ చింతనలో ఉండాలంటే.. శరీరంలో ఈ గుణం ఉండకూడదు. అందుకే పర్వదినాన ఉల్లిపాయ వద్దంటారు. ఉల్లిపాయను తింటే అది మన ఏకాగ్రతను భంగపరచి, మనస్సును లౌకిక విషయాల వైపు మళ్లిస్తుంది. ఉల్లిపాయను తినకుండా ఉంటే మనస్సు నిర్మలంగా ఉండి, భగవంతునికి మరింత దగ్గరవుతామని నమ్మకం. <<-se>>#DHARMASANDEHALU<<>>

News October 26, 2025

అమ్మకిచ్చిన మాట కోసం 150 డిగ్రీలు చేశాడు!

image

చెన్నై ప్రొఫెసర్ డా.పార్థిబన్ ఇప్పటివరకు 150 డిగ్రీ పట్టాలు అందుకున్నారు. తొలిసారి డిగ్రీ పాసైనప్పుడు తక్కువ మార్కులు రావడంతో తన తల్లి బాధపడిందని, దీంతో టాప్ ర్యాంక్ మార్కులు తెచ్చుకుంటానని ఆమెకు వాగ్దానం చేసినట్లు ఆయన తెలిపారు. 1981 నుంచి చదువుతున్నారు. చదవడాన్ని తాను ఎంజాయ్ చేస్తున్నానని, 200 డిగ్రీలు చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఆయన చదివిన వాటిలో MA, MPhil, MSc. PG, PhD వంటి కోర్సులున్నాయి.

News October 26, 2025

MBNR: BRS విజయం.. అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్

image

HYDలోని MTAR Technologies Ltd కంపెనీలో భారత రాష్ట్ర సమితి నుంచి కార్మికుల గుర్తింపు యూనియన్ ఎన్నికలలో భారత ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పై గెలుపొందారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం పెట్టుకొని గెలిపించిన కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీలో కార్మికులకు ఉన్న ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.