News March 22, 2025
ఖైరతాబాద్: స్టాండింగ్ కమిటీ సభ్యుల సమావేశం

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం స్టాండింగ్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఇలాంబర్తి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. దీంట్లో భాగంగా ఇటీవల బడ్జెట్లో జీహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.3,101.21 కోట్లు కేటాయించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నగరంలో చేపట్టాల్సిన అత్యవసర అభివృద్ధి పనులు, పరిష్కరించాల్సిన సమస్యలపై చర్చించారు.
Similar News
News March 24, 2025
ఉప్పల్: పడితే ‘పంచ’ప్రాణాలకు ముప్పే!

ట్రిపుల్ రైడింగ్ ప్రాణాలు తీస్తుందని పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ, వాహనదారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇందుకు నిదర్శనమే ఉప్పల్లో ఒకే బైకుపై ఐదుగురు ప్రయాణించడం. ఏకంగా బైక్ ట్యాంక్ మీద సైతం కూర్చోబెట్టి డ్రైవ్ చేశాడా డ్రైవర్. ఇలా డ్రైవ్ చేయడం అంటే మన ప్రాణాలు మనమే తీసుకోవడమని పోలీసులు చెబుతున్నారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
News March 24, 2025
హైటెక్సిటీలో కేఫ్ నీలోఫర్ బ్రాంచ్ ప్రారంభం

టీ, స్నాక్స్కు ప్రసిద్ధి చెందిన కేఫ్ నీలోఫర్ హైటెక్సిటీలో నూతన బ్రాంచ్ను ఆదివారం మంత్రి శ్రీధర్బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. తమ 19వ అవుట్లెట్ను 40,000sft, 700 మంది కెపాసిటీ, ప్రత్యేకమైన పార్టీ జోన్స్తో ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ఉందని MD శశాంక్ తెలిపారు. సంప్రదాయాన్ని ఆధునిక రుచితో మిళితం చేస్తూ ఇక్కడ మరిన్ని ప్రత్యేకతలతో ప్రామాణికమైన హైదరాబాదీ రుచుల వారసత్వాన్ని కొనసాగిస్తామన్నారు.
News March 24, 2025
ఉప్పల్: పడితే ‘పంచ’ప్రాణాలకు ముప్పే!

ట్రిపుల్ రైడింగ్ ప్రాణాలు తీస్తుందని పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ, వాహనదారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇందుకు నిదర్శనమే ఉప్పల్లో ఒకే బైకుపై ఐదుగురు ప్రయాణించడం. ఏకంగా బైక్ ట్యాంక్ మీద సైతం కూర్చోబెట్టి డ్రైవ్ చేశాడా డ్రైవర్. ఇలా డ్రైవ్ చేయడం అంటే మన ప్రాణాలు మనమే తీసుకోవడమని పోలీసులు చెబుతున్నారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.