News February 6, 2025

గంగాధర: వీడిన మమత హత్య కేసు మిస్టరీ

image

గత నెల 27న గంగాధర మండలం కురిక్యాల, కరీంనగర్- జగిత్యాల హైవే రోడ్డుపై లభ్యమైన <<15281772>>మమత శవం<<>> తాలూకు మిస్టరీ వీడింది. మంచిర్యాలలో నివాసం ఉంటున్న మేడ మమత(25)ను లక్షెట్టిపేటకు చెందిన వేల్పుల కళ్యాణ్ అనే వ్యక్తి రూ.ఐదు లక్షల సుపారి తీసుకొని హత్య చేసినట్లు చొప్పదండి సీఐ ఆర్. ప్రకాష్ గౌడ్ తెలిపారు. ఇందుకు సహకరించిన గుంపుల రఘు, కులుమల్ల నర్మదా, బండ వెంకటేష్, కులుమల్ల రాజలింగం లను అరెస్టు చేసినట్లు సీఐ చెప్పారు.

Similar News

News November 10, 2025

సేఫ్ పాస్‌వర్డ్ ఇలా సెట్ చేసుకోండి

image

సైబర్ నేరాలు, హ్యాకింగ్స్ విపరీతంగా పెరిగిపోతున్నందున <<18240768>>పాస్‌వర్డ్‌లపై<<>> ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సూచిస్తున్నారు టెక్ నిపుణులు. పాస్‌వర్డ్‌ను ఎలా సెట్ చేసుకుంటే సేఫ్‌ అనే విషయాలను చెబుతున్నారు. అప్పర్‌కేస్, లోయర్‌కేస్ లెటర్స్, నంబర్స్, సింబల్స్‌ కాంబోలో పాస్‌వర్డ్‌ సెట్ చేసుకోవాలని అంటున్నారు. ఫోన్ నంబర్లు, బర్త్‌డేలు, ఫ్యామిలీ మెంబర్ల పేర్లను పాస్‌వర్డ్‌లుగా పెట్టుకోకూడదని హెచ్చరిస్తున్నారు.

News November 10, 2025

కర్బూజాలో బూజు తెగులును ఎలా నివారించాలి?

image

కర్బూజాలో బూజు తెగులు ఒక సాధారణ శిలీంధ్ర వ్యాధి. ఇది ఆకులు, కాండం, పండుపై తెల్లటి లేదా బూడిద రంగు బూజు మచ్చలను ఏర్పరుస్తుంది. ఈ బూజు తెగులు నివారణకు 200 లీటర్ల నీటిలో మెటలాక్సిల్ 8%+మాంకోజెబ్ 64% డబ్ల్యూ.పి. 72% 400 గ్రా. లేదా డైమెథోమార్ఫ్ 9%+మాంకోజెబ్ 60% డబ్ల్యూ.పి. 300 గ్రా.లలో ఏదైనా ఒకదానితో పాటు జిగురు పదార్థం 100ml లను కలిపి మొక్కలకు సరిపడా ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి.

News November 10, 2025

పెరుగుతున్న దగ్గు కేసులు.. ఈ సిరప్‌లు డేంజర్!

image

చలి పెరగడంతో పిల్లల్లో దగ్గు, జలుబు <<18247158>>సమస్యలు<<>> పెరుగుతున్నాయి. దీంతో చాలామంది డాక్టర్‌ సలహా లేకుండా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్‌లు తీసుకొచ్చి తాగిస్తుంటారు. ఇటీవల దగ్గు సిరప్ తాగి పిల్లలు చనిపోయిన నేపథ్యంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా Relife CF, Respifresh-TR సిరప్‌లను TG ప్రభుత్వం నిషేధించింది. ‘కోల్డ్రిఫ్’ & ‘రెస్పిఫ్రెష్ TR’ సిరప్‌లను WHO వాడొద్దని చెప్పింది.