News September 6, 2025

గంగ ఒడికి బాలాపూర్‌ గణేశుడు

image

బాలాపూర్‌ గణేశుడు గంగ ఒడికి చేరాడు. ఉదయం మండపం నుంచి మొదలైన భారీ శోభాయాత్ర చార్మినార్, MJ మార్కెట్ మీదుగా అప్పర్‌ ట్యాంక్‌బండ్‌కు చేరుకొంది. సాయంత్రం 6:15 నిమిషాలకు క్రేన్‌ నంబర్ 12 వద్దకు చేరుకోగా విగ్రహానికి ఉత్సవ సమితి సభ్యులు పూజలు చేశారు. సాయంత్రం 6:30 గంటలకు సాగర్‌లో బాలాపూర్‌ గణేశుడిని నిమజ్జనం సంపూర్ణమైంది.

Similar News

News September 7, 2025

HYDలో PHOTO OF THE DAY

image

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనోత్సవం సాగర తీరాన జనసంద్రాన్ని తలపించింది. ఉదయం ఖైరతాబాద్ మండపం నుంచి మొదలైన భారీ శోభాయాత్రకు వేలాది మంది భక్తులు పోటెత్తారు. సెక్రటేరియట్‌ వద్దకు విగ్రహం చేరుకోగా ఇసుకేస్తే రాలనంత జనం గుమిగూడారు. చుక్కల్లో చంద్రుడి వలే భారీ ఆకారంలో మహా గణపతి, ఆ పక్కనే సచివాలయం ఒకే ఫ్రేమ్‌లో చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యం సిటీలో PHOTO OF THE DAYగా నిలిచింది.

News September 6, 2025

HYD: నంది వాహనం ఎక్కిన ‘శివ’పుత్రుడు

image

వినాయక నిమజ్జనోత్సవంలో ‘శివ’పుత్రులు దర్శనమిచ్చారు. అవును.. హిమాయత్‌నగర్‌లో ఈ దృశ్యం భక్తులను కనువిందు చేసింది. శనివారం ట్యాంక్‌బండ్‌కు ఎడ్లబండి మీద ఓ వినాయకుడిని నిమజ్జనానికి తీసుకొచ్చారు. రథసారథిగా శివుడి వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నంది వాహనం ఎక్కి గణపయ్య వస్తున్నాడు అంటూ భక్తులు పరవశించిపోయారు. ఈ వినూత్న ఆలోచన బాగుంది కదూ.

News September 6, 2025

HYD: మెట్రో మిడ్‌ నైట్.. MMTS నైట్ ఔట్

image

గణపతి నిమజ్జనం వేళ HYD మెట్రో, MMTS సేవలు పొడిగిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైలు సేవలు ఉంటాయి. రేపు ఉదయం 4.40 గంటల వరకు MMTS రైళ్లు తిరగనున్నాయి. సికింద్రాబాద్‌-ఫలక్‌‌నుమా, సికింద్రాబాద్‌-హైదరాబాద్‌, హైదరాబాద్‌-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్‌నుమా, ఫలక్‌నుమా-సికింద్రాబాద్‌ మధ్య 8 MMTS రైళ్లను అందుబాటులో ఉంచుతున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది.
SHARE IT