News October 8, 2025

గంటల కొద్దీ ఒకే అంశం ప్రస్తావించొద్దు: హైకోర్టు

image

TG: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణలో HC కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఇదే చివరి విచారణ కాదు, అన్ని అంశాలు ప్రస్తావించొద్దు. గంటల కొద్దీ ఒకే అంశం ప్రస్తావించి సమయం వృథా చేయొద్దు’ అని పిటిషనర్లకు సూచించింది. ప్రభుత్వం తరఫున అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. ‘రిజర్వేషన్ల గరిష్ఠ పరిమితి 50% మించరాదని రాజ్యాంగంలో లేదు. ప్రజల అవసరాలను బట్టి వాటిని పెంచుకొనే అవకాశం ప్రభుత్వానికి ఉంది’ అని అన్నారు.

Similar News

News October 8, 2025

‘దీపావళి’ వెలుగులు నింపాలి.. విషాదం కాదు!

image

దీపావళి అనగానే ‘బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం.. కార్మికులు సజీవ దహనం’ అనే వార్తలు వింటూ ఉంటాం. తాజాగా AP కోనసీమ జిల్లాలోనూ అలాంటి ప్రమాదమే జరిగి ఏడుగురు సజీవదహనమయ్యారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు తరచూ బాణసంచా తయారీ కేంద్రాలు, దుకాణాలను తనిఖీ చేయాలి. ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలి. కార్మికులకు జీవిత బీమా చేయించాలి. ఈ పండుగ కార్మికుల కుటుంబాల్లో విషాదం నింపకుండా చూసుకోవాలి.

News October 8, 2025

రేపు భారీ వర్షాలు: APSDMA

image

AP: ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో 2 రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. రేపు అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇవాళ NTR, GNT, బాపట్ల, అనంత, సత్యసాయి తదితర జిల్లాల్లో వర్షం పడింది.

News October 8, 2025

రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ: టీపీసీసీ చీఫ్

image

TG: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌కు ఎలాంటి అడ్డంకులు లేవని, షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. కోర్టులో తమ లాయర్లు బలమైన వాదనలు వినిపించారని, రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ ఉంటుందని చెప్పారు. బీసీ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని, కోర్టులోనూ కచ్చితంగా గెలుస్తామన్నారు. రాష్ట్రంలో 90% స్థానాలను తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.