News February 12, 2025

గండేపల్లి: బంగారు గొలుసు అపహరించిన వ్యక్తి అరెస్ట్

image

గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అమ్మాయి వేషధారణలో మరో వ్యక్తి దగ్గర లక్ష రూపాయలు విలువ చేసే బంగారు గొలుసు అపహరించాడు. దీనిపై గండేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం ఆ వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అతణ్ని కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారని జగ్గంపేట సీఐ వైఆర్‌కె తెలిపారు.

Similar News

News November 3, 2025

హోమియో వైద్యాన్ని ప్రజలు ఆదరించాలి: డీఎంహెచ్‌ఓ

image

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన హోమియో వైద్య శిబిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) రవి రాథోడ్ పాల్గొన్నారు. దుష్ఫలితాలు లేని హోమియో మందులను ప్రజలు ఆదరించి, తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని ఆయన కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. ఈ శిబిరాన్ని 200 మందికి పైగా ప్రజలు ఉపయోగించుకున్నట్లు చెప్పారు.

News November 3, 2025

GNT: పత్తి రైతులకు కలెక్టర్ సూచన

image

రైతులు CM యాప్‌లో నమోదు కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సూచించారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రూపొందించిన పోస్టర్‌ను సోమవారం కలెక్టర్ ఆవిష్కరించారు. సీసీఐ ద్వారా క్వింటాలుకు రూ.8110 మద్దతు ధర ఉందన్నారు. ప్రత్తి కొనుగోలుకు నోటిఫైడ్ చేసిన జిన్నింగ్ మిల్లులలో రైతులు విక్రయించవచ్చన్నారు. CM యాప్‌లో (CM APP) నమోదు చేసుకుని, జిన్నింగ్ మిల్లు, విక్రయ తేదీ ఎంపిక చేసుకోవచ్చని చెప్పారు.

News November 3, 2025

ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం

image

AP: తిరుపతిలోని SV యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. సైకాలజీ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ విద్యార్థులను సీనియర్స్ ర్యాగింగ్ చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిపై సైకాలజీ డిపార్ట్‌మెంట్ HOD విశ్వనాథ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ‘ర్యాగింగ్ చేస్తారు, ఏమైనా చేస్తారు’ అని అన్నారని, విశ్వనాథ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.