News March 15, 2025

గంపలగూడెం: కనుమరుగవుతున్న మామిడి తోటలు

image

ఉమ్మడి కృష్ణాజిల్లా నూజివీడు డివిజన్లో మామిడి పండ్లు అంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంత ప్రాధాన్యతుందో మనకి తెలిసిన విషయమే. ఆ డివిజన్లో గంపలగూడెం కూడా ఒక భాగమే. అయితే గంపలగూడెం మండల పరిధిలోని ఇప్పటి వరకు సుమారు 200 ఎకరాల మామిడి తోటలు నరికివేతకు గురయ్యాయి. దీనికి కారణం కోతులు బెడద, పంట చేతికొచ్చే సమయానికి వాతావరణంలో మార్పులు, ఇలా పలు కారణాలు వల్ల మామిడి తోటలు కనుమరుగవుతున్నాయని రైతులు వాపోయారు.

Similar News

News November 3, 2025

SRSP UPDATE: 24 గంటల్లో 56,514 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

image

గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 56,514 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగ అంతే మొత్తం నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు సోమవారం ఉదయం తెలిపారు. 16 స్పిల్ వే గేట్ల ద్వారా 47,060 క్యూసెక్కుల నీటిని వదిలామన్నారు. కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80.501 TMCలకు గాను తాజాగా పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు.

News November 3, 2025

బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ విచారం

image

TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్​ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్​కు తరలించి మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సీఎస్​, డీజీపీలను ఆదేశించారు.

News November 3, 2025

గుండెలు పగిలే ఫొటో

image

TG: రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో జరిగిన <<18183124>>ఆర్టీసీ బస్సు ప్రమాదంలో<<>> మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 17 మంది మరణించగా, అందులో 10 నెలల పాప కూడా ఉంది. తల్లి, బిడ్డ మృతదేహాలను బస్సులో నుంచి బయటకు తీసి రోడ్డుపై ఉంచిన ఫొటో కన్నీరు తెప్పిస్తోంది. ప్రమాద సమయంలో టిప్పర్ మితిమీరిన వేగంతో వెళ్లినట్లు సమాచారం. ఘటనాస్థలం వద్ద ప్రయాణికుల ఆర్తనాదాలతో భీతావహ వాతావరణం నెలకొంది.