News October 15, 2025
గంభీరావుపేట: ‘ప్రజలకు చేరువగా పోలీస్ విధులు ఉండాలి’

ప్రజలకు చేరువగా పోలీస్ విధులు నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సూచించారు. గంభీరావుపేట పోలీస్ స్టేషన్ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులను పరిశీలించారు. విలేజ్ పోలీస్ అధికారులు కేటాయించిన గ్రామాల్లో తరచూ పర్యటించి ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలని, రౌడీషీటర్లను తనిఖీ చేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం చేపట్టాలని ఆదేశించారు.
Similar News
News October 15, 2025
మగపిల్లలు పుట్టలేదని వ్యక్తి సూసైడ్

ఆదోని పరిధిలోని మదిరే వాసి గంపల సోమ(31) రైలు కిందపడి మంగళవారం మృతిచెందాడు. మగ పిల్లలు పుట్టలేదనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇస్వీ ఆర్ఎస్ 501/18 సమీపంలో మధ్యాహ్నం గూడ్స్ రైలు కిందపడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. 8 ఏళ్ల క్రితం వివాహం కాగా.. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 15, 2025
డీసీసీ అధ్యక్ష పదవి రేసులో నారాయణఖేడ్ నేతలు

సంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవి రేసులో నారాయణఖేడ్ నియోజకవర్గ నేతలు కూడా ఉన్నారు. మంగళవారం నారాయణఖేడ్లో కాంగ్రెస్ డీసీసీ అధ్యక్ష పదవి నియామకం కోసం నిర్వహించిన అభిప్రాయ సేకరణలో కార్యకర్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. నియోజకవర్గానికి చెందిన జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు నగేష్ షెట్కార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి పేర్లకు పలువురు మద్దతు పలికారు.
News October 15, 2025
కామారెడ్డి: తల్లి ఆత్మహత్యకు కారణమైన కొడుకు అరెస్ట్

తల్లి మృతికి కారణమైన కసాయి కొడుకును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు SI స్రవంతి తెలిపారు. పోలీసుల వివరాలు.. దోమకొండకు చెందిన చింతల సాయిలు తన తల్లి లక్ష్మవ్వ(70)కు సరిగా తిండి పెట్టకుండా వేధింస్తూ, ఇంట్లోంచి వెళ్లగొట్టాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె జీవితంపై విరక్తి చెంది ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. లక్ష్మవ్వ మృతికి ఆమె కొడుకే కారణమని నిర్ధారించి అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.