News December 1, 2025
గంభీర్.. రోహిత్, కోహ్లీ మధ్య విభేదాలు?

టీమ్ఇండియా కోచ్ గంభీర్, స్టార్ క్రికెటర్లు రోహిత్, కోహ్లీ మధ్య విభేదాలున్నట్లుగా తెలుస్తోంది. ‘గంభీర్-రోహిత్, కోహ్లీ మధ్య బంధాలు అంత బాగా లేవు. ఇద్దరు ప్లేయర్ల భవిష్యత్తుపై విశాఖ లేదా రాయ్పూర్లో మీటింగ్ జరిగే ఛాన్స్ ఉంది’ అని జాతీయ మీడియా తెలిపింది. టెస్టులకు వీరు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచే వివాదాలు మొదలైనట్లు పేర్కొంది. రోహిత్, సెలక్టర్ అగార్కర్ మధ్య కూడా సంబంధాలు సరిగా లేవని చెప్పింది.
Similar News
News April 13, 2026
నేడు RRతో SRH ఢీ.. పరుగుల వరద ఖాయం!

IPLలో ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది. భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ తలపడనున్నాయి. హైదరాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో పరుగుల వరద పారే అవకాశం ఉంది. ఈ సీజన్లో ఆడిన 4 మ్యాచుల్లోనూ గెలిచి RR దూకుడు మీద ఉంది. పైగా వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ చెలరేగి ఆడుతున్నారు. మరోవైపు SRH 4 మ్యాచుల్లో 3 ఓటములు చవిచూసింది. నేటి మ్యాచులో గెలవాలని ఉవ్విళ్లూరుతోంది.
News April 13, 2026
5 కేజీల సిలిండర్ల సరఫరా పెంపు

గ్యాస్ కొరతను నివారించేందుకు కేంద్రం 5 కేజీల LPG సిలిండర్ల సరఫరాను భారీగా పెంచింది. మార్చి 23 నుంచి 13 లక్షలకు పైగా సిలిండర్లను అమ్మింది. ప్రస్తుతం రోజువారీ సేల్స్ లక్ష యూనిట్లను దాటాయి. ఎక్కువగా వలస కార్మికులు వీటిని కొంటున్నారు. మరోవైపు మార్చి నుంచి 4.24 లక్షల PNG కనెక్షన్లను ప్రభుత్వం యాక్టివేట్ చేసింది. డొమెస్టిక్ LPG సరఫరా స్థిరంగా కొనసాగుతోంది. ఈ నెల 11న 52 లక్షల సిలిండర్లు డెలివరీ అయ్యాయి.
News April 13, 2026
సరిహద్దు గ్రామాలకు చైనా పేర్లు.. ఖండించిన భారత్

అరుణాచల్ ప్రదేశ్ సహా భారత్ సరిహద్దుల్లోని గ్రామాలకు చైనా పేర్లు మార్చడాన్ని భారత్ ఖండించింది. ఈ ఫేక్ నేమ్స్ నిజాన్ని మార్చలేవని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ తరహా చర్యలు ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత దెబ్బతీస్తాయని హెచ్చరించింది. కాగా ఇటీవల PoK సరిహద్దు వెంబడి చైనా కొత్త గ్రామాన్ని నిర్మించింది. గతంలో ఇక్కడే రెండు గ్రామాలు నిర్మించగా అందులో కొంత లద్దాక్ పరిధిలోకి వస్తుందని భారత్ తోసిపుచ్చింది.


