News March 24, 2024

గజ్వేల్‌లో ప్రతాప్‌రెడ్డి VS నర్సారెడ్డి 

image

KCR ఇలాకా గజ్వేల్‌లో BRS నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి, కాంగ్రెస్ నేత నర్సారెడ్డి మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. ఇటీవల నర్సారెడ్డిపై ప్రతాప్ రెడ్డి ఆరోపణలు చేయగా దానికి కౌంటర్‌గా కాంగ్రెస్ జగదేవ్‌పూర్ మండలాధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఈరోజు మాట్లాడారు. గజ్వేల్‌లో కాంగ్రెస్‌ను ధీటుగా నిలబెట్టిన వ్యక్తి నర్సారెడ్డి అని అన్నారు. వంటేరు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవుతాడంటూ ఎద్దేవా చేశారు.

Similar News

News September 7, 2025

మెదక్‌: 24 గంటల్లోనే విద్యుత్ పునరుద్ధరణ

image

భారీ వర్షాల కారణంగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను 24 గంటల్లోపే పునరుద్ధరించినట్లు టీజీఎస్​సీపీడీసీఎల్​ చీఫ్​ ఇంజనీర్​ బాలస్వామి తెలిపారు. మెదక్‌లోని ఎస్ఈ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 26 నుంచి 30 వరకు కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా 115 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆయన చెప్పారు.

News September 6, 2025

మెదక్: 24 గంటల్లో 110 గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరణ: సీఈ

image

జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 26 నుంచి 30వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను 24 గంటల్లోపే 110 గ్రామాలకు పునరుద్ధరించినట్లు చీఫ్ ఇంజినీర్ బాలస్వామి తెలిపారు. జిల్లా పరిధిలోని మొత్తం 115 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోగా, అధికారులు వెంటనే స్పందించి ఎస్‌ఈ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు తమ బాధ్యతలను నిర్వర్తించారని ఆయన పేర్కొన్నారు.

News September 6, 2025

మెదక్: ఆయిల్ పామ్ సాగు పెంచాలి: యాస్మిన్ బాషా

image

జిల్లాలో ఆయిల్ పామ్ సాగును పెంచాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ సంచాలకులు షేక్ యాస్మిన్ బాషా సూచించారు. ప్రభుత్వం ఈ సాగుకు భారీగా ప్రోత్సాహకాలు అందిస్తోందని ఆమె తెలిపారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్న గొట్టుముక్కల గ్రామంలో రైతు నరసింహారావు పొలంలో జరిగిన మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో ఆమె కలెక్టర్ రాహుల్ రాజ్‌తో కలిసి పాల్గొన్నారు.