News February 7, 2025

గజ్వేల్‌లో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల విలీనం

image

మల్లన్న సాగర్ ముంపుకు గురైన 7 గ్రామాలను గజ్వేల్ మున్సిపాలిటీలో విలీనమైనట్లే అని డీపీవో జానకీదేవి తెలిపారు. తొగుట మండలంలోని 5, కొండపాక మండలంలోని 2 గ్రామాలు ముంపునకు గురి కాగా గజ్వేల్‌‌ పరిధిలో ఆర్‌అండ్‌ ఆర్‌ కాలనీని నిర్మించి 4ఏళ్ల క్రితం నిర్వాసితులను తరలించారు. ఈ 7గ్రామాల పరిధిలో 15 వేల జనాభా ఉండగా, ఏడు వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. తాజాగా గజ్వేల్ గ్రేడ్ మారడంతోపాటు వార్డుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది.

Similar News

News March 7, 2026

జీవన్ రెడ్డిపై ఎంపీ అరవింద్ సాఫ్ట్ కార్నర్ ఎందుకు..?

image

మాజీమంత్రి జీవన్ రెడ్డిపై MP అరవింద్ ఎప్పుడూ సాఫ్ట్ కార్నర్‌తోనే ఉంటున్నారు. ఎంపీగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ కాదని, అర్వింద్‌కు సహకారం అందించారు. అలాగే, అరవింద్ తండ్రి శ్రీనివాస్‌తో కూడా అనుబంధం ఉంది. దీంతో ఎంపీ అరవింద్, జీవన్ రెడ్డికి మధ్య మంచి బాండింగ్ ఉంది. గురువారం జగిత్యాలకు వచ్చిన ఎంపీ.. మరోసారి జీవన్ రెడ్డిపై జాలి చూపి, ఎమ్మెల్యే సంజయ్‌పై విరుచుకు పడ్డారు.

News March 7, 2026

సివిల్స్‌లో సత్తా చాటడం రాష్ట్రానికే గర్వకారణం: అడ్లూరి

image

జాతీయ స్థాయిలో సివిల్ సర్వీసెస్ ర్యాంకులు సాధించడం తెలంగాణకు గర్వకారణమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రభుత్వ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ పొంది ఉత్తమ ఫలితాలు సాధించిన అభ్యర్థులను అభినందించారు. దళిత యువతకు నాణ్యమైన శిక్షణ, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరుపేద విద్యార్థుల ఉన్నత లక్ష్యాలకు సోపానాలుగా మారుతున్నాయన్నారు.

News March 7, 2026

నిర్మల్ జిల్లాకు చేరిన రంజాన్ గిఫ్ట్ ప్యాక్‌లు

image

రంజాన్ పండుగ పురస్కరించుకుని ప్రభుత్వం అందించే గిఫ్ట్ ప్యాక్‌లు నిర్మల్ జిల్లాకు చేరుకున్నాయి. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మైనార్టీలకు వీటిని పంపిణీ చేయనున్నారు. నిర్మల్‌కు 1000, ముధోల్‌కు 1250, ఖానాపూర్‌కు 750 ప్యాక్‌లు కేటాయించారు. ఒక జత దుస్తులతో కూడిన ఈ తోఫాను మైనార్టీ కుటుంబాలకు త్వరలోనే అందజేయనున్నారు. అధికారులు పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు.