News February 7, 2025

గజ్వేల్‌లో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల విలీనం

image

మల్లన్న సాగర్ ముంపుకు గురైన 7 గ్రామాలను గజ్వేల్ మున్సిపాలిటీలో విలీనమైనట్లే అని డీపీవో జానకీదేవి తెలిపారు. తొగుట మండలంలోని 5, కొండపాక మండలంలోని 2 గ్రామాలు ముంపునకు గురి కాగా గజ్వేల్‌‌ పరిధిలో ఆర్‌అండ్‌ ఆర్‌ కాలనీని నిర్మించి 4ఏళ్ల క్రితం నిర్వాసితులను తరలించారు. ఈ 7గ్రామాల పరిధిలో 15 వేల జనాభా ఉండగా, ఏడు వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. తాజాగా గజ్వేల్ గ్రేడ్ మారడంతోపాటు వార్డుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది.

Similar News

News February 7, 2025

అత్యధిక విద్యావంతులున్న దేశాలివే!

image

ప్రపంచంలోనే జపాన్‌లో అత్యధికంగా విద్యావంతులు ఉన్నట్లు తాజాగా విడుదలైన ఓ నివేదికలో వెల్లడైంది. ఇండియా 53వ స్థానంలో ఉండగా చైనా 27, అమెరికా 22వ స్థానాల్లో ఉన్నాయి. విద్యావంతులు కలిగిన దేశాల జాబితా వరుసగా.. జపాన్, స్వీడన్, స్విట్జర్లాండ్, జెర్మనీ, డెన్మార్క్, కెనడా, నార్వే, నెదర్లాండ్స్, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, యూకే, ఫ్రాన్స్, సౌత్ కొరియా, ఐర్లాండ్, ఇటలీ, USA, స్పెయిన్, చైనా, రష్యా, UAE ఉన్నాయి.

News February 7, 2025

రాజమండ్రి: పార్కులు థీమ్స్ పార్క్‌లు అభివృద్ధి చేయాలి- కలెక్టర్

image

రాజమండ్రిలోని పార్కులను మూస పద్ధతిలో కాకుండా ఒక ప్రత్యేకత కలిగిన థీమ్‌లతో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి స్పష్టం చేశారు. 2027 పుష్కరాల నాటికి ఆమేరకు పనులు పూర్తి చెయాలని తెలిపారు. శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె మాట్లాడారు. నగరంలోని 26 పార్కులను ఆయా పార్కుల అభివృద్ధి ఒక ప్రత్యేకత కలిగి ఉండేలా చూడాలని సూచించారు.

News February 7, 2025

Stock Markets: పుంజుకొని మళ్లీ పడిపోయిన సూచీలు

image

నేడు బెంచ్‌మార్క్ సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. నిఫ్టీ 23,559 (-43), సెన్సెక్స్ 77,860 (-197) వద్ద ముగిశాయి. రెపోరేటు తగ్గించడంతో పుంజుకున్న సూచీలు మధ్యాహ్నం ఇంట్రాడే కనిష్ఠానికి చేరాయి. ఆఖర్లో కాస్త పెరిగి నష్టాలను తగ్గించుకున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, FMCG, O&G షేర్లు పడిపోయాయి. మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆటో షేర్లు ఎగిశాయి. టాటాస్టీల్, ITC హోటల్స్, AIRTEL, JSW స్టీల్, TRENT టాప్ గెయినర్స్.

error: Content is protected !!