News October 6, 2025
గజ్వేల్: కామన్ డైట్ మెనూ పాటించాలి: కలెక్టర్

గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పప్పు, ఆలు గడ్డ, క్యారెట్ కలిపి కూర, సాంబార్, బాగరా అన్నం పెడుతున్నట్లు వంట సిబ్బంది తెలపగా కూర నాణ్యత మెరుగుపరచి రుచికరంగా వండాలని సిబ్బందిని ఆదేశించారు. కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని, ఆకుకూరలు ఎక్కువగా వాడాలని సూచించారు.
Similar News
News October 6, 2025
RECORD: 10 గ్రా. బంగారం రూ.1.30 లక్షలు

దేశంలో బంగారం ధరలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1.30 లక్షలు దాటింది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.1,57,400గా ఉంది.
News October 6, 2025
మరణ భయాన్ని పోగొట్టే శివ మహా పురాణం

మానవ జీవితంలో మరణ భయాన్ని మించిన భయం మరొకటి లేదు. అటువంటి భయాన్ని సమూలంగా పోగొట్టే దివ్యౌషధం శివ మహాపురాణం. దీనిని కేవలం శ్రవణం చేస్తేనే మహా పుణ్యఫలం సిద్ధిస్తుంది. సమస్త వేద, శాస్త్ర, పురాణ, ఇతిహాస, మంత్ర, తంత్ర, జప, తప, ధ్యాన, యోగాదుల జ్ఞానానికంతటికీ సారభూతమైంది ఈ పరమ పవిత్రమైన పురాణం. ఈ గ్రంథ పారాయణం శివ తత్వాన్ని బోధించి, మోక్ష మార్గాన్ని సుగమం చేస్తుంది. <<-se>>#SIVOHAM<<>>
News October 6, 2025
HYDలో 95% పెరిగిన బిల్టప్ ఏరియా

గత 30 ఏళ్లలో దేశంలోని ప్రధాన నగరాల్లో నిర్మాణాల విస్తీర్ణం రెట్టింపైందని ‘సిటీస్ ఇన్ మోషన్’లో స్వైర్ యార్డ్ సంస్థ వెల్లడించింది. 8 ప్రధాన నగరాల్లో బిల్టప్ ఏరియా మొత్తం 4,308 చదరపు కిలోమీటర్లకు చేరింది. ఇది 98% పెరుగుదలగా పేర్కొంది. HYDలో ప్రస్తుతం బిల్టప్ ఏరియా 519 చ.కి.మీ.గా ఉండగా, 1995లో 267 చ.కి.మీ. మాత్రమే ఉండేది. ఈ మధ్యకాలంలో 252 చ.కి.మీ. పెరిగి, 95% వృద్ధి నమోదైంది.