News May 25, 2024
గజ్వేల్: కాలం చెల్లిన 610 కిలోల విత్తనాలు స్వాధీనం

గజ్వేల్ పట్టణంలోని సీడ్స్ & ఫర్టిలైజర్ షాపుల్లో గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి, ఇన్స్పెక్టర్ సైదా తనిఖీలు నిర్వహించారు. 610 కిలోల కాలం చెల్లిన విత్తనాలు, మెంతులు గంగవాయిలు కూర, బీర్నిస్, వరి ధాన్యం, కొన్ని రకాల పురుగుల మందులు ఫర్టిలైజర్స్ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. సీపీ ఆదేశాల మేరకు గజ్వేల్ పట్టణంలో ఉన్న సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.
Similar News
News November 4, 2025
మెదక్: స్పెషల్ లోక్ అదాలత్ను వినియోగించుకోండి: ఎస్పీ

ఈనెల 15న జరిగే స్పెషల్ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు సూచించారు. జిల్లా పోలీస్ అధికారులు, కోర్ట్ డ్యూటీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించేందుకు న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ, ప్రతి పోలీస్ అధికారి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను సమీక్షించారు. ఏఎస్పీ మహేందర్ ఉన్నారు.
News November 4, 2025
మెదక్: రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు నిజాంపేట విద్యార్థి ఎంపిక

రాష్ట్రస్థాయి రగ్బీ క్రీడా పోటీలకు నిజాంపేట మండలానికి చెందిన విద్యార్థి కార్తీక్ గౌడ్ ఎంపికయ్యాడు. తూప్రాన్లోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ గ్రౌండ్లో జరిగిన 69వ ఎస్జీఎఫ్ అండర్-17 ఉమ్మడి మెదక్ జిల్లా రగ్బీ సెలక్షన్లో కార్తీక్ గౌడ్ ఎంపికైనట్లు జడ్పీ హైస్కూల్ హెచ్ఎం జ్ఞానమాల, పీడీ ప్రవీణ్ తెలిపారు. విద్యార్థి ఎంపిక పట్ల ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేసింది.
News November 4, 2025
మెదక్ జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష

మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్లో సోమవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆయా శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఏవైనా అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడితే సహించేది లేదన్నారు. అవినీతి అనేది పెద్ద నేరమని, ఎవరికైనా అలాంటి ఆలోచనలు ఉంటే మానుకోవాలని హెచ్చరించారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


