News October 29, 2025

గజ్వేల్: వాచ్‌మెన్ దారుణ హత్య.. ఇద్దరు పరారీ

image

వాచ్‌మెన్ దారుణ హత్యకు గురైన ఘటన గజ్వేల్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఆడెపు బాలయ్య గజ్వేల్‌లోని Vమార్ట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతకగా సమీపంలోని చెట్లల్లో అతడి మృతదేహం లభ్యమైంది. బాలయ్యతోపాటు పనిచేస్తున్న బిహార్‌కు చెందిన ఇద్దరు వాచ్‌మెన్‌లు పరారీలో ఉండటంతో వారే హత్య చేసి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

Similar News

News October 29, 2025

TG: మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో ఇవాళ అత్యంత భారీ వానలు పడతాయంటూ IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. పిల్లల్ని బయటికి పంపించొద్దని తల్లిదండ్రులకు సూచించారు.

News October 29, 2025

GNT: అత్యాచారయత్నంపై బాధితురాలి ఫిర్యాదు

image

కూతురిపై అత్యాచారయత్నం చేయడానికి ప్రయత్నించిన మారుతండ్రిపై అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పల్నాడు (D) రాజుపాలెం (మం) బ్రాహ్మణపల్లికి చెందిన ఓ మహిళ పెళ్లై భర్తతో విభేదాల కారణంగా దూరమైంది. ప్రస్తుతం గుంటూరు పొట్టిశ్రీరాములునగర్‌లో మరో వ్యక్తితో ఉంటుంది. అయితే ఆ మహిళ ఇంట్లో లేని సమయంలో కూతురిపై మారుతండ్రి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో బాధితురాలు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

News October 29, 2025

తుఫాన్ ఎఫెక్ట్.. HYDలో సెలవుకు డిమాండ్

image

మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో HYDతో సహా ఉమ్మడి RRలో రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. నగరంమంతా మబ్బు కమ్మేసి ఇంకా చీకటిగా ఉంది. కాగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని నగరవాసుల నుంచి డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. ఇంటి నుంచి విద్యాలయాలకు తడుస్తూనే వెళ్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలో సెలవులు ప్రకటించగా HYDలో ఇవ్వాలని అధికారులను కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్.