News October 6, 2025

గజ్వేల్: సోషల్ పీజీటీ, టీజీటీ పోస్టుల దరఖాస్తులకు రేపే లాస్ట్ డేట్

image

గజ్వేల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ గర్ల్స్ మైనారిటీ పాఠశాలలో ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సుధారాణి తెలిపారు. గర్ల్స్ స్కూల్‌లో టీజీటీ సోషల్, పీజీటీ సోషల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 7లోగా పాఠశాలలో దరఖాస్తు అందించాలని సూచించారు. మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించామని తెలిపారు.

Similar News

News October 6, 2025

కైకలూరులో అత్యధిక వర్షం

image

ఏలూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు సోమవారం వెల్లడించారు. అత్యధికంగా కైకలూరు మండలంలో 38.2 mm వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా భీమడోలు మండలంలో 0.4 mm వర్షం కురిసింది. 10మండలాల్లో ఎటువంటి వాన పడలేదు. జిల్లాలో సరాసరిన 7.7 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది.

News October 6, 2025

VITMలో 12పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

విశ్వేశ్వరయ్య ఇండస్ట్రీయల్& టెక్నలాజికల్ మ్యూజియం(VITM) 12 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 20వరకు అప్లై చేసుకోవచ్చు. వీటిలో ఎగ్జిబిషన్ అసిస్టెంట్, టెక్నిషియన్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ITI, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.885. మహిళలు, SC, ST, PwDలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. వెబ్‌సైట్: https://www.vismuseum.gov.in/

News October 6, 2025

ADB: ప్రచారం వారమే.. ఓటర్ల మనసు గెలవాలి..!

image

స్థానిక సంస్థల్లో మండల, జిల్లా పరిషత్ తొలిదశ ఎన్నికలకు ఈనెల 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రకటన వెలువడిన రోజు నుంచి మూడు రోజుల్లో నామినేషన్ల దాఖలు చేయాలి. ఇక ఉపసంహరణలు పూర్తయ్యాక పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం చేయడానికి కేవలం వారమే ఉంటుంది. ఈ వారంలో వారి ప్రచారం, ప్రణాళికను బట్టి ఓట్లు వస్తాయి. తొందరపాటులో చేసిన తప్పు ప్రత్యర్థికి పాజిటివ్‌గా మారవచ్చు. నిబంధనలు దాటకుండా ప్రచారం చేస్తేనే మేలు.