News December 3, 2025

గట్టమ్మ వద్ద రోడ్డు విస్తరణ పనులు పరిశీలించిన ఎస్పీ

image

మేడారం మహా జాతరకు వచ్చే భక్తులు ముందుగా జాకారం సమీపంలోని గట్టమ్మ ఆలయాన్ని సందర్శించుకుంటారని ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అన్నారు. ఈ మేరకు గట్టమ్మ వద్ద ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన రహదారి విస్తరణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

Similar News

News April 17, 2026

దొరికిపోయిన ‘జననాయగన్’ లీక్ దొంగలు

image

విజయ్ సినిమా ‘జననాయగన్’ లీక్ కేసును పోలీసులు ఛేదించారు. ఓ ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్ సినిమా స్టూడియో సెక్యూరిటీని దాటుకొని మరీ డిజిటల్ రీల్స్‌ను దొంగిలించినట్లు గుర్తించారు. వేరే ప్రాజెక్టులో పని చేస్తూ ఎడిటింగ్ రూమ్‌లోకి అక్రమంగా ప్రవేశించిన నిందితుడు.. డేటాను దొంగిలించి మరో ఇద్దరికి చేరవేశాడు. దీంతో సినిమా ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. ముగ్గురు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

News April 17, 2026

‘గరుడ’ విష్ణుమూర్తి వాహనం ఎలా అయ్యాడు?

image

వినత కుమారుడైన గరుడుడు తన తల్లిని బానిసత్వం నుంచి విడిపించడానికి కద్రువ కోరిక మేరకు దేవలోకం నుంచి అమృతాన్ని తెస్తాడు. అపారమైన శక్తి ఉన్నా, అమృతంపై ఆశ పడడు. తల్లి కోసం నిస్వార్థంగా పనిచేసిన ఆయన ధైర్యం మహావిష్ణువును మెప్పించాయి. దీంతో విష్ణుమూర్తి, అతనికి చిరంజీవిత్వం ప్రసాదించి తన వాహనంగా, ధ్వజంగా స్వీకరించారు. గరుడుడు సముద్రాలను దాటగలడు. వేగవంతుడు. విష్ణు సాయం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.

News April 17, 2026

జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా..!

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం పసుపు (పిల్ల కొమ్ము) గరిష్ఠ ధర రూ.12,400, కనిష్ఠ ధర రూ.8,000గా నమోదైంది. పసుపు (మండ కొమ్ము) గరిష్ఠ ధర రూ.11,655, కనిష్ఠం రూ.8,000 ఉండగా, కందులు రూ. 6,768, చిక్కుడు రూ. 4,611, వరి (1010) రూ. 1,752 చొప్పున పలికాయి. మొక్కజొన్న గరిష్ఠ ధర రూ. 1,857 కనిష్ఠ ధర రూ. 1,801గా పలికాయని మార్కెట్ అధికారులు. మార్కెట్‌కు ఈరోజు మొత్తం 652 క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగాయన్నారు.