News September 19, 2025

గట్టు: అజ్ఞాతం వీడినా ఇంటికి చేరని మావోయిస్ట్

image

మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యురాలు కల్పన @ పద్మ ఇటీవల అజ్ఞాతం వీడినా నేటికి స్వగ్రామానికి (గట్టు మండలం పెంచికలపాడు) చేరుకోలేదు. జనజీవన స్రవంతిలో కలిసిన ఆమె స్వగ్రామానికి వస్తుందని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఎదురుచూస్తున్నారు. ఆమె ఎక్కడ ఉన్నారు అన్న ప్రశ్నకు సమాధానం లేదు. కుటుంబ సభ్యులు ఆచూకీ గురించి అధికారులను కలిసినట్లు సమాచారం. 45 ఏళ్ల క్రితం అడవి బాట పట్టగా ఈ నెల 13న పోలీసుల ఎదుట లొంగిపోయారు.

Similar News

News September 19, 2025

‘చలో మెడికల్ కాలేజీ’.. వైసీపీ ఆందోళనలు

image

AP: మెడికల్ కాలేజీల PPP విధానంపై వైసీపీ ‘చలో మెడికల్ కాలేజీ’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు కొందరు ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేశారు. మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం అని నేతలు విమర్శించారు. ప్రైవేటీకరణను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు #SaveMedicalCollegesInAP అంటూ వైసీపీ ట్వీట్లు చేస్తోంది.

News September 19, 2025

డయేరియా బాధితుల పరిస్థితి నిలకడగా ఉంది: కలెక్టర్

image

డయేరియాపై ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. బుధవారం 33 మంది డయేరియా లక్షణాలతో జీజీహెచ్‌లో చేరారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడారు. రోగులు కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధి ప్రబలిందని వైద్యుల ప్రాథమిక నివేదికలో తేలిందన్నారు. తాగునీటి శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపుతున్నామన్నారు.

News September 19, 2025

కడప: పోలీసుల అదుపులో ఎర్రచందనం స్మగ్లర్లు..!

image

తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎర్రచందనం కూలీలను కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసులు అదుపులోకి తీసుకునట్లు తెలుస్తోంది. మండలంలోని పెద్ద శెట్టిపల్లి వద్ద ఎర్రచందనం తరలించేందుకు వెళ్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. 15 మంది కూలీలను అదుపులోకి తీసుకుంటూ సమాచారం. వీరి వెనుక ఉన్న ప్రధాన స్మగ్లర్ ఎవరనే దానిపై కడపకు తరలించి విచారిస్తున్నట్టు తెలుస్తోంది.