News November 3, 2024
గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవాలి: ADB కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకం గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో చేపడుతున్న ఇందిరా మహిళా శక్తి పథకం అమలు తీరు పై శనివారం కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Similar News
News November 9, 2025
ఆదిలాబాద్: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఇవే

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఆదిలాబాద్, భీంపూర్, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, ఇంద్రవెల్లి, నార్నూర్ ప్రాంతాల్లో ప్రారంభించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు ఆదిలాబాద్, జైనాథ్, బేల, భీంపూర్, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. నాణ్యతా ప్రమాణాలను మించిన పంటను కొనుగోలు చేయబడదని స్పష్టం చేశారు.
News November 9, 2025
మొక్కజొన్న, సోయాబీన్కు మద్దతు ధరతో కొనుగోలు: ADB కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లా రైతుల కోసం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న, సోయాబీన్ పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నట్లు కలెక్టర్ రాజార్షి షా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నాణ్యతా ప్రమాణాలను మించిన పంటను కొనుగోలు చేయబడదని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల వివరాలు, సందేహాల కోసం రైతులు 6300001597ను సంప్రదించాలన్నారు.
News November 9, 2025
రాష్ట్రస్థాయి పోటీలో ఫైనల్కు ADB జట్టు

నారాయణపేటలో జరుగుతున్న ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ అండర్-17 బాలికల విభాగంలో ఆదిలాబాద్ జిల్లా జట్టు ఫైనల్కు చేరింది. సెమి ఫైనల్ మ్యాచ్లో కరీంనగర్ జట్టుపై ఆదిలాబాద్ జట్టు విజయం సాధించింది. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్లలో జిల్లా జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తూ.. ఘన విజయాలను నమోదు చేసినట్లు జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ రామేశ్వర్ తెలిపారు. జిల్లా జట్టుకు DEO రాజేశ్వర్ అభినందనలు తెలిపారు.


