News August 18, 2025

గడ్డేన్న ప్రాజెక్టుకు సందర్శకులు రావొద్దు: సీఐ

image

గడ్డేన్న ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడం వల్ల సందర్శకులు ఎవరూ అటువైపు రావద్దని సీఐ గోపీనాథ్ హెచ్చరించారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తున్నందున, ప్రాజెక్టు దిగువన వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుందని ఆయన తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రాజెక్టు వద్ద తాళ్లు కట్టామని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

Similar News

News August 18, 2025

కేంద్రమంత్రిని మంత్రిని కలిసిన మినిస్టర్ దుర్గేశ్

image

న్యూఢిల్లీలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను మంత్రి కందుల దుర్గేశ్
సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధిపై చర్చించారు. లేపాక్షిలో కల్చరల్ సెంటర్ రూ.103కోట్లు, లంబసింగిలో ఎక్స్పీరియన్స్ సెంటర్ & టూరిజం అభివృద్ధి రూ.99.87 కోట్లు, బుద్ధిస్ట్ సర్క్యూట్ ప్రాజెక్టుల డీపీఆర్‌ను మంత్రికి సమర్పించారు.

News August 18, 2025

పార్వతీపురం జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు

image

పార్వతీపురం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా మంగళవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు ఒక రోజు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం వర్షాల కారణంగా విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. >Share it

News August 18, 2025

జిల్లాలో యూరియాకు కొరత లేదు: కలెక్టర్ ఇలా త్రిపాఠి

image

నల్గొండ జిల్లాలో రైతులకు యూరియా కొరత లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 70 శాతం మంది రైతులు యూరియాను కొనుగోలు చేశారని, ప్రణాళిక ప్రకారం యూరియా అందిస్తున్నామన్నారు. సోమవారం మంత్రి తుమ్మల, సీఎస్ రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో యూరియా లభ్యత, పంపిణీ గురించి వివరించారు.