News January 23, 2025
గణతంత్ర వేడుకలకు గంగదేవిపల్లి మాజీ సర్పంచ్కు ఆహ్వానం

ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు గీసుగొండ మండలం జాతీయ ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లి తాజా మాజీ సర్పంచ్ గోనె మల్లారెడ్డికి ఆహ్వానం అందినట్లు ఆయన చెప్పారు. గంగదేవిపల్లి అభివృద్ధి చెందిన విధానంపై పలుమార్లు ప్రసార భారతి ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రస్తావించారు. గ్రామ ప్రజలు ఐక్యతతో సాధించిన అభివృద్ధికి తనకు ఆహ్వానం అందిందని మల్లారెడ్డి తెలిపారు.
Similar News
News March 1, 2026
హోలీ.. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు

హోలీ పండుగ నేపథ్యంలో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లుగా సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ నుంచి నహరిగన్ సహా ఇతర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు చెప్పారు. Rail One యాప్ ద్వారా వీటికి సంబంధించిన వివరాలను చూసుకునే వెసులుబాటును కల్పించినట్లుగా తెలిపారు.
News March 1, 2026
మైనారిటీ పథకాలలో ములుగు జిల్లాకు మొండిచేయి!

మైనార్టీల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల్లో ములుగు జిల్లాకు మొండిచేయి చూపుతోంది. తాజాగా 90% రాయితీపై ఎలక్ట్రికల్ స్కూటర్లు, టూల్ కిట్లు, జనరేటర్లను అందించేందుకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకుంది. ఈరోజుతో గడువు ముగిసింది. అయితే, ఆన్లైన్ పోర్టల్లో ములుగు సహా మొత్తం 8 జిల్లాల పేర్లు లేవు. దీంతో లబ్ధిదారులు ఈ పథకాలకు దూరమయ్యారు.
News March 1, 2026
అభివృద్ధిలో కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సేవలు అభినందనీయం

భద్రాద్రి జిల్లా అభివృద్ధిలో కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిపాలన ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. 2024 జూలై 16న బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఫిబ్రవరి 26, 2026 వరకు ఆయన జిల్లాను సమగ్రాభివృద్ధి దిశగా నడిపారు. తన పదవీకాలంలో గిరిజన సంక్షేమం, వ్యవసాయం, విద్యా, ఆరోగ్య రంగాలకు పెద్దపీట వేయడమే కాకుండా, యువత సాధికారతకు కృషి చేశారు. అభివృద్ధి, రహదారి మౌలిక వసతుల కల్పనలో ఒక విజన్తో అద్భుత ఫలితాలను సాధించారు.


