News March 3, 2025
గణనీయంగా తగ్గిన గంజాయి సాగు: హోం మంత్రి

కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల కారణంగా రాష్ట్రంలో గంజాయి సాగు గణనీయంగా తగ్గిందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె సోమవారం సమాధానం ఇస్తూ 11,000 ఎకరాల నుంచి గంజాయి సాగు ప్రస్తుతం 100 ఎకరాలకు తగ్గిందన్నారు. గంజాయి సాగును పూర్తిగా నిర్వీర్యం చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు నియమించిన ఈగల్ టీం గంజాయి నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News September 19, 2025
భారత్-చైనాని ట్రంప్ భయపెట్టలేరు: రష్యా మంత్రి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల బెదిరింపులు భారత్-చైనాలను భయపెట్టలేకపోయాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్ వ్యాఖ్యానించారు. ‘నాకు నచ్చనిది చేయకండి టారిఫ్స్ విధిస్తాను అన్న ధోరణి ప్రాచీన నాగరికత కలిగిన భారత్, చైనా విషయంలో పనిచేయదు. అమెరికాకు అది అర్థమవుతోంది. సుంకాలు వేస్తే ఆ దేశాలను ఇంధనం, మార్కెట్ వంటి రంగాల్లో ఆల్టర్నేటివ్స్ వైపు మళ్లిస్తాయి’ అని తెలిపారు.
News September 19, 2025
Bigg Boss: ఆ ముగ్గురు డేంజర్ జోన్లో!

ఈ వారం నామినేషన్స్లో సుమన్ శెట్టి, పవన్, ప్రియ, భరణి, ఫ్లోరా, మనీశ్, హరీశ్ ఉన్నారు. ఈ ఏడుగురిలో సుమన్ శెట్టి ఓటింగ్లో టాప్లో ఉన్నట్లు తెలుస్తోంది. హరీశ్, ఫ్లోరా కూడా మంచి పొజిషన్లోనే ఉండొచ్చు. కానీ మనీశ్, పవన్, ప్రియ డేంజర్ జోన్లో ఉండే ప్రమాదం ఎక్కువ కనిపిస్తోంది. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారని రివ్యూవర్స్ ప్రిడిక్ట్ చేస్తున్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? కామెంట్ చేయండి.
News September 19, 2025
ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర పతనం

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం పత్తి ధరలు పడిపోయాయి. పత్తి గరిష్ఠంగా క్వింటాం రూ.7,665, కనిష్ఠంగా రూ.7389 పలికింది. వేరుశనగ గరిష్ఠ ధర రూ.4,568, కనిష్ఠ ధర రూ.4,093, ఆముదం గనిష్ఠ ధర రూ.6,070 పలికినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. రైతులు మాత్రం పత్తి ధర రోజురోజుకూ పతనమవుతుందని ఆందోళన చెందుతున్నారు. గతంలో రూ.8-12 వేల వరకు పత్తిని కొనుగోలు చేసేవారని అన్నారు.