News August 26, 2025

గణేశ్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి: కాటారం డీఎస్పీ

image

వినాయక చవితి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ కోరారు. కాటారం షబ్ డివిజన్ పరిధిలోని 5 మండలాల గణేశ్ మండలి నిర్వాహకులతో సోమవారం సమాశేశం నిర్వహించారు. శాంతి కమిటీ సమావేశంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ పలు సూచనలు చేశారు. ప్రతి గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీసుల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు.

Similar News

News August 26, 2025

ఇటిక్యాల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

image

గద్వాల జిల్లా ఇటిక్యాల మండల పరిసర ప్రాంతాలలో పులి సంచారం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ సెక్షన్ అధికారి మన్యమయ్య అన్నారు. సోమవారం ఆయన ఇటిక్యాల మండల కేంద్రానికి శివారులోని పంట పొలాలను పరిశీలించి మాట్లాడారు. పులి అని నమ్మడానికి ఆధారాలు ఏవి కనిపించడం లేదన్నారు. చూసిన వాళ్లు మాత్రమే పులి ఉందని చెప్తున్నారని ఆయన అన్నారు. పంట పొలాలకు వెళ్లే రైతులు, బాటసారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News August 26, 2025

HYD: వినాయక చవితి ఏ రోజు జరుపుకోవాలంటే!

image

వినాయక చవితి ఏ రోజు నిర్వహించుకోవాలనే విషయంపై ప్రజల్లో గందరగోళం నెలకొంది. అయితే ఈ నెల 22, 23 రెండు రోజులు అమావాస్య రావడంతో చవితి ఏ రోజు అనేది అర్థం కావడం లేదు. దీంతో భాద్రపద శుక్ల చవితి ఈ నెల 27న అని, ఆ రోజే వినాయక చవితి జరుపుకోవాలని షాద్‌నగర్‌లోని వేద పండితులు క్లారిటీ ఇచ్చారు. వినాయక పూజ చేసుకోవడానికి ఉ.11:05 నుంచి మ.1:40 వరకు మంచి ముహూర్తం అన్నారు. నిమజ్జనం సెప్టెంబర్ 6న చేయాలన్నారు.

News August 26, 2025

శివభక్తులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన సజ్జనార్‌

image

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు ‘X’లో పోస్ట్‌చేశారు. ఎయిర్‌పోర్టు బోర్డింగ్‌ పాయింట్‌ నుంచి నేరుగా శ్రీశైలానికి బయలుదేరవచ్చని పేర్కొన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా సజ్జనార్ కోరారు.