News September 12, 2024

గణేశ్ మండపంలోకి చెప్పులతో మాజీ ఎమ్మెల్యే

image

మాజీ ఎమ్మెల్యే ఆంజాద్ బాషా చెప్పులు వేసుకుని గణేశ్ మండపంలో వినాయకుడి విగ్రహం ముందు ఫొటోలు దిగడం కడప నగరంలో కలకలం రేపింది. ఆయన కడప మేయర్ సురేశ్ బాబుతో కలిసి మంగళవారం 25వ డివిజన్ రాధాకృష్ణనగర్‌లోని గణేశ్ మండపానికి వచ్చారు. పూజల అనంతరం అక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ సూర్యనారాయణ, వైసీపీ నాయకులతో కలిసి చెప్పులు వేసుకుని ఫొటోలు దిగారు. దీనిపై హిందూ సంఘాలు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News September 29, 2024

ముద్దనూరు వద్ద అదుపుతప్పి లారీ బోల్తా

image

కడప జిల్లా ముద్దనూరు మండలంలోని నల్లబల్లె రహదారిపై ఆదివారం తెళ్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ముద్దనూరు నుంచి తాడిపత్రి బైపాస్ పనుల కొరకు కంకర లోడ్‌తో వెళ్తున్న ఓ టిప్పర్ ఉదయం 2.30 సమయంలో అదుపు తప్పి పంట పొలాల్లో బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఒకేసారి పదుల సంఖ్యలో టిప్పర్లు వెళ్తుండగా వెనక టిప్పర్​కు దారిచ్చే ప్రయత్నంలో ప్రమాదం జరిగిందన్నారు.

News September 29, 2024

చక్రాయపేటలో ఆరేళ్ల బాలికపై అత్యాచార యత్నం

image

కడప జిల్లా చక్రాయపేట మండలంలో నెరుసుపల్లె గ్రామం అప్పిరెడ్డిగారిపల్లెలో శివాజీ అనే యువకుడు, శనివారం ఆరేళ్ల బాలికకు చాక్లెట్ ఆశ చూపి అత్యాచారయత్నానికి ఒడిగట్టినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆ బాలికను కడప రిమ్స్‌కు తరలించినట్లు తెలిసింది. పోలీసులు అత్యాచార యత్నానికి పాల్పడిన యువకుడు శివాజీని అరెస్టు చేసి ఫోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం.

News September 29, 2024

వేంపల్లి: యూట్యూబర్‌పై కేసు నమోదు

image

వేంపల్లెలో ఓ యూట్యూబ్ ఛానెల్ అధినేతపై కేసు నమోదు చేశారు. తన ఛానెల్లో పని చేస్తున్న యువతిని వేధించిన కేసులో సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు CI సురేష్ రెడ్డి తెలిపారు. ‘అతడి ఛానెల్లో యాంకర్‌గా పనిచేసే సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడు. అక్కడ మానేసినా వేధింపులు అపలేదు. తాను అతడి మాటలు వినలేదని తన ఆఫీసు నుంచి నా సర్టిఫికేట్లు తీసుకెళ్లానని అబద్దపు కేసు పెట్టారు’ అని ఫిర్యాదులో తెలిపింది.