News September 6, 2025

గణేశ్ మహా నిమజ్జనానికి GHMC అన్ని ఏర్పాట్లు

image

గ్రేటర్ HYDలో నేడు గణేశ్ మహా నిమజ్జనం జరుగనుంది. నిమజ్జనం సజావుగా సాగేందుకు GHMC అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలీస్‌, ఇతర శాఖలతో సమన్వయం చేస్తూ కార్యక్రమం సాఫీగా జరగడానికి చర్యలు తీసుకుంది. స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇస్తూ 15వేల మంది సిబ్బందితో 24×7 పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతోంది. నగర వ్యాప్తంగా శోభాయాత్రలను మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వీ కర్ణన్ నిమజ్జనాన్ని మానిటర్ చేస్తున్నారు.

Similar News

News September 6, 2025

జయజయధ్వానాల నడుమ గంగమ్మ ఒడికి గణపయ్య

image

ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం మొదలైంది. గణపతి బప్పా మోరియా జయజయధ్వానాల నడుమ క్రేన్ సాయంతో గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. ట్యాంక్ బండ్ పరిసరాలు గణపయ్య నామ స్మరణతో దద్దరిల్లుతున్నాయి. గణపతిని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

News September 6, 2025

క్రేన్ నం.4 వద్ద ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం

image

ఖైరతాబాద్ బడా గణేశుడి శోభాయాత్ర భారీ భద్రత మధ్య అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ ఊరేగింపును చూసేందుకు వచ్చిన భక్తులతో నగరం సంద్రాన్ని తలపిస్తోంది. ట్యాంకు బండ్‌పై క్రేన్ నం.4 వద్ద అధికారులు నిమజ్జనం బడాగణేశ్‌ను గంగమ్మఒడికి చేర్చనున్నారు. భక్తులు భారీగా చేరుకుంటుండంటంతో మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని నిర్వహకులు చెబుతున్నారు.

News September 6, 2025

ఖైరతాబాద్ గణపతికి శోభయాత్ర రూట్ మ్యాప్

image

ఖైరతాబాద్ మహా గణపతికి కమిటీ సభ్యుడు రాజ్‌కుమార్ కలశ పూజ చేశారు. కొద్దిసేపట్లో మహా గణపతి గంగమ్మఒడికి బయలుదేరనున్నారు. ఈ శోభాయాత్ర టెలిఫోన్‌ భవన్‌, సచివాలయం మీదుగా ట్యాంక్‌ బండ్‌ వరకు చేరుకోనుంది. బడా గణేశ్ – సైఫాబాద్ ఓల్డ్ పీఎస్- ఇక్బాల్ మినార్- తెలుగుతల్లి ఫ్లైఓవర్- అంబేడ్కర్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్‌కు చేరుకోనుంది. భక్తులు పెద్ద సంఖ్యలో హుస్సేన్ సాగర్‌కు తరలివస్తున్నారు.