News April 15, 2025

గద్వాలలో ఇదీ పరిస్థితి..!  

image

గద్వాల మున్సిపాలిటీ ఆఫీస్‌లో రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన అర్జీలను రికార్డు చేసేందుకు ఇష్టం వచ్చిన పేర్లను నమోదు చేసుకుంటున్నారని స్థానికులు తెలిపారు. రికార్డులో పేరు రాయాల్సిన సంబంధిత శాఖ అధికారులు చోద్యం చూస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారని ఆరోపించారు. ఆర్జీలను ఇవ్వడానికి వెళ్లిన ప్రజలకు సహాయం అందించాల్సింది పోయి వారిపై అసహనం వ్యక్తం చేస్తూ వారితో వాగ్వాదానికి దిగుతున్నారన్నారు.

Similar News

News February 27, 2026

మార్చి 16 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు: కలెక్టర్

image

ఉన్నత చదువులకు తొలి మెట్టైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై వివరాలు శుక్రవారం తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. పరీక్షలకు ఇంకా కొన్ని రోజులే సమయం ఉండడంతో మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థులు పాటు పడాలన్నారు.

News February 27, 2026

పార్వతీపురం: ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 413 మంది గైర్హాజర్

image

పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం హిస్టరీ, బోటనీ పరీక్షకు 413 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు DVEO నాగేశ్వరరావు తెలిపారు. జనరల్ విద్యార్ధులు 840 మందికి 80 మంది, ఒకేషనల్ విద్యార్థులు 2,957 మందికి 333 మంది పరీక్ష రాయలేదని వెల్లడించారు.

News February 27, 2026

సీఎంలుగా చేసి ఇతర పార్టీల్లోకి జంప్!

image

ఒక పార్టీ నుంచి రాష్ట్రానికి CMగా వ్యవహరించినా రాజకీయ సమీకరణాలు, అవకాశాల కోసం పలువురు పార్టీ మారడానికి వెనకాడటం లేదు. తాజాగా TN మాజీ సీఎం <<19250954>>పన్నీర్ సెల్వం<<>> DMKలో చేరారు. INC నుంచి CMలుగా చేసిన అశోక్ చవాన్(మహారాష్ట్ర), కిరణ్‌కుమార్‌రెడ్డి(AP), అమరీందర్(పంజాబ్) BJPలో చేరారు. చంపై సోరెన్(ఝార్ఖండ్‌) JMM నుంచి BJPలోకి వెళ్లారు. జగదీశ్ షెట్టర్(కర్ణాటక) BJP నుంచి INCలోకి వెళ్లి మళ్లీ సొంతగూటికి చేరారు.