News April 15, 2025
గద్వాలలో ఇదీ పరిస్థితి..!

గద్వాల మున్సిపాలిటీ ఆఫీస్లో రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన అర్జీలను రికార్డు చేసేందుకు ఇష్టం వచ్చిన పేర్లను నమోదు చేసుకుంటున్నారని స్థానికులు తెలిపారు. రికార్డులో పేరు రాయాల్సిన సంబంధిత శాఖ అధికారులు చోద్యం చూస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారని ఆరోపించారు. ఆర్జీలను ఇవ్వడానికి వెళ్లిన ప్రజలకు సహాయం అందించాల్సింది పోయి వారిపై అసహనం వ్యక్తం చేస్తూ వారితో వాగ్వాదానికి దిగుతున్నారన్నారు.
Similar News
News October 28, 2025
HYD: చీకటైనా పిల్లలు ఇంటికి రాలేదు.. పట్టించుకోరా?

యాచారం మం.లోని తాటిపర్తికి వెళ్లే బస్సు సకాలంలో రాకపోవడంతో బస్టాండ్లోనే విద్యార్థులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. నిత్యం ఇదే పరిస్థితి ఉత్పన్నమవుతోన్నా పాలకులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో విద్యార్థులు గమ్యస్థానాలకు చేరేందుకు నానా అవస్థలు పడుతున్నారు. నేడు కొందరు లిఫ్ట్ అడిగి వెళ్లారు. మరికొందరు బస్టాండ్లో నిరీక్షించడం గమనార్హం. పాలకులకు పట్టవా? అన్న విమర్శలొస్తున్నాయి.
News October 28, 2025
HYD: చీకటైనా పిల్లలు ఇంటికి రాలేదు.. పట్టించుకోరా?

యాచారం మం.లోని తాటిపర్తికి వెళ్లే బస్సు సకాలంలో రాకపోవడంతో బస్టాండ్లోనే విద్యార్థులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. నిత్యం ఇదే పరిస్థితి ఉత్పన్నమవుతోన్నా పాలకులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో విద్యార్థులు గమ్యస్థానాలకు చేరేందుకు నానా అవస్థలు పడుతున్నారు. నేడు కొందరు లిఫ్ట్ అడిగి వెళ్లారు. మరికొందరు బస్టాండ్లో నిరీక్షించడం గమనార్హం. పాలకులకు పట్టవా? అన్న విమర్శలొస్తున్నాయి.
News October 28, 2025
ఆదిలాబాద్: ‘ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి’

ANM, ఆశావర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో ప్రతి గర్భిణిని గుర్తించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తల్లుల పోషకాహారం లోపం, గర్భధారణ సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం, అనారోగ్య పరిస్థితుల్లో సమయానికి వైద్యసేవలు అందకపోవడం వంటి కారణాల వల్ల తక్కువ బరువుతో పుట్టిన శిశువుల సంఖ్య పెరుగుతోందన్నారు. వైద్య, శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.


