News March 19, 2025
గద్వాలలో దారుణం..!

గద్వాల మండలం చేనుగోనిపల్లిలో దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. వృద్ధులపై గుర్తుతెలియని దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు. అనాథలైన వృద్ధులపై మానవమృగాలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు గద్వాల ఆసుపత్రికి తరలించారు. కాగా వృద్ధుల్లో ఒకరికి కళ్లు కనిపించవు. మరొకరికి మతిస్థిమితం సరిగా లేదు.. మానవత్వం మరిచి వృద్ధులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు.
Similar News
News November 5, 2025
తిరుమలలో మహిళ మృతి.. ఈమె మీకు తెలుసా?

తిరుమల మెయిన్ కళ్యాణకట్ట ఎదురుగా ఓపెన్ షెడ్లో ఓ మహిళకు ఫిట్స్ వచ్చాయి. వెంటనే అశ్విని ఆసుపత్రికి అక్కడి నుంచి తిరుపతి రుయాకు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఆమె పేరు ఏ.మంగ(40) అని మాత్రమే తెలిసింది. ఎవరైనా ఈ మహిళను గుర్తిస్తే తిరుమల వన్ టౌన్ పోలీసులను 9440796768, 9440796771, 0877-2289027 నంబర్ల ద్వారా సంప్రదించాలని కోరారు.
News November 5, 2025
సంగారెడ్డి: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

నిరుద్యోగ గ్రామీణ యువతకు టూవీలర్ మెకానిక్ ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం(RSETI) డైరెక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన వారై ఉండి వయస్సు 19- 40 మధ్య ఉండాలి. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన వారు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు బైపాస్ రహదారిలోని కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News November 5, 2025
BELలో 47 పోస్టులు.. అప్లైకి కొన్ని గంటలే ఛాన్స్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(B<


