News October 16, 2025
గద్వాల్: ‘అక్రమంగా మట్టి తరలిస్తున్నా పట్టించుకోని అధికారులు’

జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో మట్టి దందా ఆగడం లేదు. పట్టపగలే అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. కొందరు ట్రాక్టర్ను ఆపి డ్రైవర్ను అడగగా రాజకీయ పార్టీ నాయకుల పేర్లు చెప్పాడు. రాజకీయ నాయకుల అండతో అక్రమ దందా జోరుగా సాగుతోంది. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News October 16, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 16, 2025
MNCL: ఈ నెల 17న మినీ జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు ఈ నెల 17న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ తెలిపారు. మెరీనా ప్లాంట్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 2190 పోస్టులకు మేళ నిర్వహిస్తున్నారు. పది, ITI, డిగ్రీ, ఎంబీఏ
చేసి 18 నుంచి 40 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు. సీవీ రామన్ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
News October 16, 2025
IPS పూరన్ భార్య, బావమరిదిపై కేసు

IPS పూరన్ కుమార్ సూసైడ్, ఆపై ASI సందీప్ ఆత్మహత్య వ్యవహారం మరిన్ని ట్విస్టులతో సాగుతోంది. సందీప్ భార్య ఫిర్యాదుతో పూరన్ భార్య అమ్నీత్(IAS), బావ మరిది అమిత్ రట్టన్(MLA), సెక్యూరిటీ ఆఫీసర్ సుశీల్, మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సందీప్ వీడియో, సూసైడ్ నోట్లను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఆయన ఆస్తులపైనా ఆరా తీస్తున్నారు. కేసు పెట్టే వరకు సందీప్ పోస్టుమార్టానికి ఆయన కుటుంబం అంగీకరించలేదు.