News March 24, 2025
గద్వాల్: కలెక్టర్ కార్యాలయం ముందు రైతుల ఆందోళన

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఆర్డీఎస్ రైతులు సాగు నీరు గత రెండు వారాల నుంచి ఇవ్వడం లేదని, పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని, వెంటనే సాగు నీరు అందివ్వాలని సుమారు పన్నెండు గ్రామాల రైతులు కలెక్టరేట్ ముందు ఈరోజు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కలెక్టర్కు తమ సమస్యలు పరిష్కరించాలని తెలపగా సానుకూలంగా స్పందించారు.
Similar News
News November 3, 2025
కంకరలో కూరుకుపోయి ఊపిరి ఆగి..

TG: రంగారెడ్డి జిల్లాలో జరిగిన <<18183371>>బస్సు ప్రమాదంలో<<>> మృతుల సంఖ్య భారీగా ఉండడానికి కంకరే కారణమని తెలుస్తోంది. మితిమీరిన వేగంతో టిప్పర్ బస్సుపైకి దూసుకొచ్చింది. దీంతో అందులోని కంకర మొత్తం బస్సులో కుడివైపు కూర్చున్న ప్రయాణికులపై పడింది. అందులో కూరుకుపోవడంతో ఊపిరి తీసుకోలేక చాలా మంది ప్రాణాలు వదిలినట్లు సమాచారం. బస్సులో ఎక్కువ మంది ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నారు. ఇప్పటివరకు 21 మంది చనిపోయారు.
News November 3, 2025
కొన్ని క్యాచులు ట్రోఫీలను గెలిపిస్తాయి!

క్రికెట్లో క్యాచులు మ్యాచులనే కాదు.. <<18182320>>వరల్డ్ కప్<<>>లను కూడా గెలిపిస్తాయి. 1983WC ఫైనల్లో కపిల్ దేవ్ వివ్ రిచర్డ్స్(WI) క్యాచ్ పట్టి తొలి ట్రోఫీని అందించారు. 2024-T20WC ఫైనల్లో డేవిడ్ మిల్లర్(SA) ఇచ్చిన క్యాచ్ను సూర్యకుమార్ చాకచక్యంగా అందుకోవడంతో కప్ సొంతమైంది. తాజా WWCలో SA కెప్టెన్ లారాను అమన్జ్యోత్ అద్భుతమైన క్యాచ్తో పెవిలియన్కు పంపడంతో భారత్కు అపూర్వ విజయం దక్కింది.
News November 3, 2025
కృష్ణా: డిసెంబర్లో జాతీయ లోక్ అదాలత్.!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో డిసెంబర్ 18న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా జడ్జి గోపి తెలిపారు. లోక్ అదాలత్ కోసం జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కక్షిదారులు రాజీపడే అన్ని కేసులను పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని ఇరు పార్టీల కక్షిదారులు తమ న్యాయవాదులతో సంప్రదించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.


